సంక్షిప్త వార్తలు (6)
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. ఒక్కరోజే 94,263కు పైగా కేసులు పరిష్కారం కాగా, వీటిలో 87,805 పెండింగ్, 6,458
లోక్ అదాలత్లలో 94,263 కేసుల పరిష్కారం
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. ఒక్కరోజే 94,263కు పైగా కేసులు పరిష్కారం కాగా, వీటిలో 87,805 పెండింగ్, 6,458 ప్రీలిటిగేషన్ కేసులున్నాయి. రూ.93.07 కోట్ల పరిహారం అందజేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. రాజీకి అవకాశమున్న పలు కేసుల్ని ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.సురేశ్రెడ్డి బెంచ్లను నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 451 కేసులు పరిష్కరించి, రూ.3.34 కోట్ల పరిహారం బాధితులకు అందజేశారు. లోక్ అదాలత్లకు సహకరించిన న్యాయవాదులు, అధికారులు, కక్షిదారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారేష్
హైదరాబాద్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ భవానీపురం ప్రాంతానికి చెందిన డాక్టర్ ఎన్.మారేష్ నియమితులయ్యారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమానికి విరామం లేదన్నారు.
స్వల్పంగా కంపించిన భూమి
వరికుంటపాడు, పామూరు, న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, ఉదయగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం 5:11 గంటలకు, రాత్రి 9:09 గంటలకు పెద్దశబ్దంతో 3 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతంలోనూ శనివారం స్వల్పంగా భూమి కంపించింది. పామూరు పట్టణంలోని తూర్పు, ఆకుల వీధులు.. మండలంలోని తిరగలదిన్నె, గోపాలపురం, నర్రమారెళ్ల గ్రామాల్లో మూడు సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు.
నేడు ఐటీ సమన్వయకర్తలు, వాలంటీర్లతో పవన్ సమావేశం
ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఆదివారం మంగళగిరిలో ఐటీ సమన్వయకర్తలు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఐటీ నిపుణుల సహాయ సహకారాలు ఏ రకంగా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చిస్తారు. పార్టీ నేతలు, శ్రేణులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఐటీ విభాగం ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను నిర్వహించనున్నారు.
పదోన్నతుల్లో ఫీడర్ కేటగిరీ సర్వీసునే తీసుకోవాలి: ఉపాధ్యాయ సంఘాలు
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులకు మెరిట్ కం రోస్టర్, ఫీడర్ కేటగిరీ సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, బహుజన ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సర్వీసు రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ ఖరారు తేదీని తీసుకోవడం వల్ల చాలామందికి పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నాయి. గతంలో మెరిట్ కం రోస్టర్, ఫీడర్ కేటగిరీ సర్వీసునే ప్రాతిపదికగా తీసుకొని పదోన్నతులు కల్పించారని, ఇప్పుడూ అదే విధానాన్ని పాటించాలని డిమాండ్ చేశాయి.
బోధనేతర పనులతో ఉపాధ్యాయుల్లో మానసిక ఆందోళన: ఫ్యాప్టో
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులకు రకరకాల యాప్ల పేరుతో బోధనేతర కార్యక్రమాలు కేటాయిస్తూ మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఫ్యాప్టో) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల విమర్శించారు. ‘‘పాఠశాలల ప్రారంభంలో ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు ఉండవని, బోధనకే పరిమితం చేస్తామని అధికారులు చెప్పారు. యాప్ల సంఖ్యను కుదించి మరింత సరళీకరణ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఉపాధ్యాయుల సొంత సెల్ఫోన్లోనే యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలని అంటున్నారు. నెట్ భారం సైతం వారిపైనే వేస్తున్నారు. విద్యాకానుక కిట్లు, విద్యార్థుల హాజరు, బేస్లైన్ పరీక్ష ఫలితాలు నమోదు చేయాలంటూ యాప్లను పెట్టి, సకాలంలో అప్లోడ్ చేయలేదని వందల మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధన పనులకే పరిమితం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!