రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం
‘రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఈ
ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి ఇదే పునాది
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వై.ఎస్.జగన్
ఈనాడు, అమరావతి: ‘రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతో పాటు పటిష్ఠ బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఈ మూడేళ్లలో మా ప్రభుత్వం మనసుపెట్టి తీసుకొచ్చిన మార్పు ఇది’ అని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. వివిధ రంగాల్లో గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు కొద్దిమంది వ్యక్తులకు ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించినవి కావని, అవి వ్యవస్థను మార్చేవన్నారు. రానున్న దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్ని, మహిళల అభ్యదయాన్ని, సామాజిక వర్గాలకు అందేలా రాజకీయ అధికారాన్ని నిర్ణయించే మార్పులని వివరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అధికారంలోకి వచ్చాక అందరూ మన ప్రజలే అని నమ్మి ప్రతి ఒక్క పథకంలోనూ సంతృప్త స్థాయి విధానాలను అమలు చేశామని గుర్తు చేశారు. అందుకే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రధానాంశాలివీ...
వాటి అన్వేషణే మా మూడేళ్ల పాలన
‘స్వతంత్ర దేశంగా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవలేదన్నది ఎంత వాస్తవమో.. ఒక దేశంగా భారత్కు లభించిన స్వతంత్రం వ్యక్తులు, కులాలు, ప్రాంతాలుగా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేక మంది ప్రజల్లో ఇప్పటికీ ఉండిపోయిందనేది అంతే వాస్తవం. సమ సమాజం, సామాజిక న్యాయం, చదువుకునే హక్కు, మహిళలకు సమాన హక్కు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణ కోసం ఈ గడ్డపై జరుగుతున్న పోరాటాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవన్నీ సమాజంలో జరుగుతున్న ఉద్యమాలు. వీటన్నింటికీ మనం మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాలి. వాటి అన్వేషణే మా మూడేళ్ల పాలన.
* రైతులు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికులు గుడిసెల్లో జీవించటాన్ని, ప్రభుత్వ బడికెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మాధ్యమంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక నిస్సహాయంగా చనిపోవడాన్ని... మన రాష్ట్రానికి చెందిన కొందరు పరిపాలనగా చెప్పుకొంటారని రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా?’ అని ప్రశ్నించారు.
మూడేళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం
* ‘ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే 2.7 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశాం. గత మూడేళ్లలో రైతు సంక్షేమానికి రూ.83 వేల కోట్లు వెచ్చించాం. వ్యవసాయంపై రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. మా మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది.
* పేదలకు ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 1.25 కోట్ల జనాభాకు సొంతిల్లు లేదని తేలింది. వీరికి ఇప్పటికే ఇళ్ల పట్టాలిచ్చాం. 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
* ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నాం. వివిధ పథకాలతో విద్యారంగంపై రూ.53 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని వివరించారు.
శకటాలు, కవాతు ప్రదర్శనలకు బహుమతులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ శాఖల శకటాలు, సాయుధ బలగాల కవాతు ఆకట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయ శాఖ (గడప గడపకూ ప్రభుత్వం), విద్యాశాఖ (నాడు-నేడు), గృహనిర్మాణ శాఖ (నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు) శకటాలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి. కవాతు ప్రదర్శనలో విజయనగరంలోని ఏపీఎస్పీ అయిదో బెటాలియన్ ప్రథమ, కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం