సంక్షిప్త వార్తలు (4)
గిరిజనాభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. ఎస్టీల విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో
గిరిజనాభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: గిరిజనాభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. ఎస్టీల విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో విజయవాడలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించడానికి ఎస్టీ కమిషన్ చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఆదివాసీల రాజ్యాంగపరమైన హక్కులను కాపాడతాం’ అని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా గిరిజన బాలికల పాఠశాలల్లో తనిఖీల పేరిట బయటి వ్యక్తులు వస్తే సహించబోమన్నారు. గిరిజన ఉపాధ్యాయ సంఘాలను గుర్తిస్తామని, 5 డిప్యూటీ డీవో పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న పలు సమస్యలను ఉపాధ్యాయులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కమిషన్ కార్యదర్శి సతీశ్, సభ్యులు విశ్వేశ్వరరాజ, శంకర్నాయక్, మురళి, లిల్లీ, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వాటా 40 శాతం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 18,800 మెగావాట్లలో సుమారు 40 శాతం (7,500 మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే అందుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. పునరుత్పాదక విద్యుత్ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టులతో పాటు విద్యుత్ ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని ఆయన చెప్పారు. ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో ఏపీ, కేరళ తరహాలో మిగిలిన రాష్ట్రాలు ఇంధన సామర్థ్య విభాగాలు ఏర్పాటు చేయాలని బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే సూచించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) పొదుపు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.
సూపర్వైజర్ల నియామకాన్ని ఆపాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్
ఈనాడు డిజిటల్, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్2) పోస్టుల నియామకాన్ని ప్రభుత్వం నిలిపేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ.బేబిరాణి, కే. సుబ్బరావమ్మ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. మే 18న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ‘కీ’ని ఇప్పటివరకు విడుదల చేయకపోవడం పలు అనుమానాలు, అపోహలకు తావిస్తోందని స్పష్టం చేశారు. పరీక్ష రాసిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేయాలని, ఆ తర్వాతే మెరిట్ ఆధారంగా వీడియోలు తీసి ఫైనల్ లిస్టు ప్రకటించాలని కోరారు.
బదిలీలు చేయాలి
ఏపీ దళిత, గిరిజన ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: తమ స్వస్థలాల నుంచి సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలను బదిలీ చేయాలని ఏపీ దళిత, గిరిజన ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న కొందరు ఆరోగ్యమిత్రలు వారి స్వస్థలాల నుంచి సుమారు 70 కి.మీ దూరం వెళ్లి పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రవాణా ఖర్చులకే సగం జీతం ఖర్చవుతోందని వాపోయారు. దీనిపై ప్రభుత్వ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు