ఇద్దరు నేతలకే ‘సంకల్పసిద్ధి!’
‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్ మార్ట్తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్ మార్ట్ నిర్వాహకులు.
రూ.1100 కోట్ల డిపాజిట్ల వసూళ్లలో ప్రజాప్రతినిధుల కీలకపాత్ర
తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ డిపాజిటర్లు
పోలీసులు, వారి బంధువుల్లోనూ బాధితులు
ఈనాడు, అమరావతి: ‘కోటీశ్వరుడయ్యే అవకాశం పిలుస్తోంది రా.. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఇంకా ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ పేదవాడు ధనవంతుడు అవడం కేవలం సంకల్ప్ మార్ట్తోనే సాధ్యం’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు సంకల్ప్ మార్ట్ నిర్వాహకులు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.1,100 కోట్లు వసూలు చేశారు. ఇక బోర్డు తిప్పేద్దామనుకునే క్రమంలో ఫిర్యాదు రావడంతో సంస్థ బండారం బయటపడింది. ఇందులో కీలకపాత్రధారులుగా భావిస్తున్న వేణుగోపాల్, కిరణ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు పేరుకే నిర్వాహకులని, తెరవెనుక ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న ప్రచారం ఉంది. వీరి సన్నిహితులే వెనక ఉండి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా వారే శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ నెల 13న విజయవాడలోని ఓ హోటల్లో కీలక వ్యక్తులు సమావేశం నిర్వహించి దీనిని ఎలా తొక్కిపెట్టాలా అని సమాలోచనలు సాగించినట్లు సమాచారం.
కనిగిరిలో పోలీసుల అదుపులో ఇద్దరు
విజయవాడ నగర పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయవాడతోపాటు ప్రకాశం జిల్లా కనిగిరి, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, తదితర ప్రాంతాలకు బృందాలు వెళ్లాయి. కనిగిరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకుని, రహస్య ప్రాంతంలో విచారణ జరిపారు. నిందితుల కుటుంబసభ్యులు, కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
సొమ్మంతా బెంగళూరుకు తరలింపు
సంస్థలో కీలక వ్యక్తులైన వేణుగోపాల్, కిరణ్ గన్నవరంలో స్థిరపడ్డారు. దీంతో ఈ ప్రాంతం వారే ఎక్కువ మంది డిపాజిట్ చేశారు. డబ్బు రెట్టింపవుతుందన్న ఆశతో విజయవాడ వన్టౌన్కు చెందిన వ్యాపారులు, పోలీసులు, వారి బంధువులు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. పథకాలు బాగున్నాయని, తేలికగా డబ్బు సంపాదిస్తున్నామని నకిలీ సమీక్షలతో ఎక్కువ మందిని ఆకర్షించారు. నగదు విత్డ్రాయల్స్ను పది రోజుల క్రితం ఆపేశారు. డిపాజిటర్లు నిలదీయడంతో యాప్ హ్యాకయిందని, సరిచేస్తున్నామని నచ్చజెప్పి పంపారు. వ్యాపారంలో వసూలైన సొమ్మంతా ప్రతి శనివారం బెంగళూరులో ఓ ఫాంహౌస్కు తీసుకెళ్లి దాచేవారని తెలిసింది. అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారని, బెంగళూరులో ఇటీవల కార్యాలయం కూడా తెరిచారని విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ కార్యాలయం ఏర్పాటు చేశారు. కనిగిరిలో ఓ ఆగ్రోఫామ్స్కు చెందిన భూమిలో 20 ఎకరాలు తీసుకున్నామని, ఇందులో ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నామని, స్థలంతోపాటు వీటిని కూడా కేటాయిస్తామని నిర్వాహకులు పలు పథకాల పేరుతో మోసం చేశారు. వాస్తవానికి నిర్వాహకులు ఎలాంటి భూములూ కొనలేదు. ఈ పథకాల్లో డబ్బు కట్టినవారికి కనిగిరిలో ప్లాట్ ఇస్తామని దస్తావేజుపై రాసిచ్చారు. ఇటీవల సత్తుపల్లిలో ఓ భూమికి సంబంధించి యజమానులతో ఒప్పందం చేసుకుని, ఆ పత్రాలను చూపించీ ప్రచారం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో నిత్యావసరాల మార్ట్లు తెరిచారు. డిపాజిట్దార్లు రూ.3 వేల విలువైన సరకులు కొంటే.. రూ.500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. దీనిని ఎరగా చూపించి చాలా మందిని ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
ప్రతి మెడికల్ కళాశాలకు ఆసుపత్రి అత్యవసరం. అలాంటిది ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే కళాశాల భవనం, హాస్టల్ గదులకు 2023 సెప్టెంబరులో సీఎం జగన్ హడావుడిగా ప్రారంభోత్సవం చేసేశారు. -
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. -
వసూల్ బ్రదర్స్
ఏ నియోజకవర్గానికైనా.. ఒక ప్రజాప్రతినిధి ఉంటారు.. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే.. మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే... అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. -
ఇక్కడి ఘటనలు చూసి అమెరికాలో చలించిపోతున్నాం
‘ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు చూసి అమెరికాలో ఉండి కూడా మేం చలించిపోతున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రైతుల బలవన్మరణాలు ఎక్కువయ్యాయి. -
జగన్ మార్కు కట్టుకథలు..!
అణువణువునా అతిశయం, అహంభావం.. నోరు తెరిస్తే అబద్ధం.. మూర్తీభవించిన ఫ్యూడల్ స్వభావం.. సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు గోడమీద పిల్లివాటం... కొన్ని ప్రశ్నలకు మౌనం, విచిత్ర హావభావాలే సమాధానం..!. -
రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు
సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. -
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. -
జిల్లాల వారీగా సీఎఫ్డీ ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల్లో అక్రమాలు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున 13 ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల పరిశీలకుల్ని నియమించినట్లు సీఎఫ్డీ ఛైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ తెలిపారు. -
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు సెలవు
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు