జగన్ కుట్రకు మరో ఏడుగురి బలి
నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది.
న్యూస్టుడే బృందం: నెలనెలా కొండంత ఆసరానిచ్చే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ కుట్ర అభాగ్యుల ఉసురు తీస్తోంది. జగన్ నిరంకుశ వైఖరి పదుల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. కాలే కడుపులతో ఆశగా బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పండుటాకులు రాలిపోతున్నాయి. మండుతున్న ఎండల్లో దూర ప్రయాణాలు చేస్తూ చివరకు వారు కనిపించని లోకాలకు చేరుకోవాల్సి వస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా మరో ఏడుగురు తనువు చాలించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదాంతం. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన షేక్ మౌలాబి (80) తన కుమారుడి సాయంతో సచివాలయం-2 వద్దకెళ్లి గంటపాటు వేచి ఉండి పింఛను తీసుకున్నారు. ప్రయాణంలో వడదెబ్బకు గురయ్యారు. శనివారం ఉదయం అచేతనంగా పడుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
- శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమిట్ట ప్రాంతానికి చెందిన గద్దె వైనమ్మ (65) పింఛను డబ్బులను బ్యాంకు నుంచి ఎండలో తెచ్చుకున్నాక అస్వస్థతకు గురవడంతో బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. ఇదే జిల్లా సైదాపురం మండలం లింగనపాళెం గ్రామానికి చెందిన వెంకట్రాజు (80) నెల్లూరులో కుమారుడి వద్ద ఉంటున్నారు. పింఛను కోసం శనివారం స్వగ్రామమైన లింగనపాళెం బయల్దేరారు. సచివాలయ సిబ్బంది మార్గమధ్యలో సైదాపురంలో పింఛను ఇచ్చారు. ప్రయాణంలో వేసవి తాపంతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు.
- వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లెకు చెందిన పింఛనుదారు గోనే గురివిరెడ్డి (65)కి రెండు బ్యాంకు ఖాతాలున్నాయి. వృద్ధాప్య పింఛను కోసం శుక్రవారం మండేఎండలో బద్వేలులోని బ్యాంకు చుట్టూ తిరిగారు. అక్కడ నగదు జమ కాలేదనడంతో బి.కోడూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లి పింఛను పొందారు. ఇంటికెళ్లాక వడదెబ్బతో స్పృహ తప్పి చనిపోయారు. మరో సంఘటనలో ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఎం.ఓబన్న(80) ఎండలో బ్యాంకు వద్దకెళ్లి నీరసించి వడదెబ్బతో చనిపోయారు. ఇదే జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లె పంచాయతీ సోగలపల్లె గ్రామానికి చెందిన వృద్ధుడు కె.వెంకటన్న (75) పింఛను డబ్బులకు రెండు రోజులుగా నందిమండలం బ్యాంకుకు వెళ్లగా ఖాతాకు సొమ్ము జమ కాలేదన్నారు. ఇంటినుంచి బ్యాంకుకు మండే ఎండల్లో తిరిగే క్రమంలో వడదెబ్బకు గురయ్యారు. కడప ఆసుపత్రికి తరలిస్తుండగా రాత్రి చనిపోయారు.
- కృష్ణా జిల్లా కంకిపాడులోని పులిరామారావునగర్కు చెందిన లోయ మల్లయ్య (72) పక్షవాతంలో మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. కుటుంబసభ్యులు 2వ తేదీన సంబంధిత సచివాలయానికి వెళ్లి పింఛను కోసం వాకబు చేయగా బ్యాంకు ఖాతాలో జమయిందని చెప్పారు. ఖాతా పుస్తకం ఇంట్లో కనిపించలేదు. ఆధార్కార్డుతో బ్యాంకుకు వెళ్లగా ఖాతా మనుగడలో లేదని, రూ.వంద చలానా కట్టాలని సూచించారు. ఏ నంబరుకు జమచేయాలో తెలియక మళ్లీ ఇంటికి వచ్చారు. ఈలోగా ఎండలకు తాళలేక అస్వస్థుడై శనివారం మరణించారు.
పింఛను కోసం వృద్ధుడి పాట్లు
మండుటెండలో పింఛను కోసం వృద్ధులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కళ్లులేని, నడవలేని వృద్ధులను సైతం అధికారులు బ్యాంకుకు రప్పిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం పంచాయతీ పరిధి నేల్తేరు గ్రామానికి చెందిన కడియం వీరభద్రం(70) ఏడాదిగా మంచానికే పరిమితమయ్యారు. కళ్లూ కనిపించవు. పింఛను కోసం సచివాలయానికి వెళ్లగా బ్యాంకుకు వెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకురాలు ఓ యువకుడి సాయంతో ద్విచక్రవాహనంపై ఆనందపురం బ్యాంకుకు తీసుకొచ్చారు. అక్కడ మూడు గంటలపాటు వేచి ఉండి పింఛను సొమ్ము పొందాల్సి వచ్చింది.
న్యూస్టుడే, విశాఖపట్నం (ఆనందపురం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. -
2 లక్షల మందికి బీసీజీ టీకా పూర్తి
రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి వ్యాప్తి, కేసుల నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల్లో గడిచిన 2 రోజుల్లో 2 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. -
కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్ప
తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్లు హైదరాబాద్కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు డాక్టర్ దీపాపైస్వాల్, డాక్టర్ ఎస్.ఎస్.జాదవ్, డాక్టర్ కరుతపాండి శుక్రవారం తిరుపతిలో ఓ ప్రకటన విడుదల చేశారు. -
జడ్పీ అధికారుల అత్యుత్సాహం
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సచివాలయ ఉద్యోగులను తీసుకునేందుకు కర్నూలు జడ్పీ సీఈవో కసరత్తు చేయడం దుమారం రేపింది. పైగా.. కలెక్టరు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టామని తెలపడం విస్మయానికి గురి చేసింది. -
కలెక్టర్, ఎస్పీల నియామకంపై ఈసీకి అధికారుల జాబితా
కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు. -
ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శ్రీసత్యసాయి, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి. -
ఎయిర్కార్గో సేవలకు మోక్షం ఎప్పుడు?
వైకాపా ప్రభుత్వం ఎయిర్కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్కార్గో సేవలు నిలిచిపోయాయి. -
శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ తీగల వంతెన
రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
కూలి అడిగినందుకు కులం పేరుతో దూషించారు
కూలి అడిగినందుకు కులం పేరుతో దూషించి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దళిత కూలీలు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనాను శుక్రవారం సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. -
గుంతల మధ్య దారేదీ!
విజయవాడ నగరం మీదగా వెళ్లే రెండు జాతీయ రహదారులను (ఎన్హెచ్65, ఎన్హెచ్16) కలుపుతున్న ప్రసాదంపాడు- కానూరు ప్రధాన రోడ్డు దుస్థితి ఇది. -
లండన్ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్
కుటుంబసభ్యులతో... సీఎం జగన్ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్ బయల్దేరి వెళ్లారు. -
అడుగంటిన గుండ్లకమ్మ
ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి