రోడ్డు గుంతలో పడి సైనికుడికి గాయాలు

సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది.

Updated : 05 May 2024 06:50 IST

విధుల్లో చేరేందుకు వెళుతుండగా ప్రమాదం

దుగ్గిరాల, న్యూస్‌టుడే: సెలవును సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం సరిహద్దులకు బయలుదేరిన సైనికుడిని గుంతల రోడ్డు గాయాలపాలు చేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముట్టుపల్లికి చెందిన ఎస్‌.ఉదయ్‌కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగేళ్లుగా సైనికుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన ఆయన.. శనివారం దిల్లీకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.

ఉదయం బైక్‌ మీద కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా తెనాలి-మంగళగిరి రోడ్డులోని మోరంపూడి దగ్గరకు వచ్చేసరికి ఆయన బైక్‌ గుంతలో పడి అదుపు తప్పింది. ఈఘటనలో ఉదయ్‌ ముఖానికి, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో తొలుత అతడిని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తెనాలి నుంచి మంగళగిరి వరకూ 24 కి.మీ ఉన్న ఈ రోడ్డుపై అన్నీ గుంతలే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని