Bapatla: బలిపశువుగా బాపట్ల ఆర్టీసీ డీఎం
ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను కాపాడటానికి ఏ అధికారి అయినా ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు.
పోస్టు నుంచి తప్పించిన యాజమాన్యం
రూ.కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని వైకాపా కార్యాలయానికి ఇవ్వడంపై డీఎం అభ్యంతరం
ఈనాడు - అమరావతి : ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను కాపాడటానికి ఏ అధికారి అయినా ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. వైకాపా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్టీసీకి చెందిన రూ.కోట్ల విలువైన భూమిని కాపాడటానికి బాపట్ల ఆర్టీసీ డీఎం శ్రీనివాసరెడ్డి ప్రయత్నించడాన్ని పెద్ద నేరంగా ప్రభుత్వ పెద్దలు పరిగణించారు. తమ అభిమతానికి వ్యతిరేకంగా పని చేశారని ఆ పోస్టు నుంచి తప్పించి, ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
1990లో బాపట్లలో ఏపీఐఐసీ నుంచి ఆర్టీసీ 10.62 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 6.54 ఎకరాల్లో గ్యారేజీ నిర్మించుకుని 4.08 ఎకరాలను భవిష్యత్తు అవసరాలకు అట్టిపెట్టుకుంది. ఈ స్థలాన్ని 2003లో వెనక్కి తీసుకుంటామని ఏపీఐఐసీ ఆర్టీసీకి నోటీసిచ్చింది. వివిధ పన్నులు, నిర్వహణ వ్యయం తదితరాలు మినహాయించి రూ.3 వేల చెక్కును ఆర్టీసీకి పంపింది. తమ భవిష్యత్తు అవసరాలకు స్థలం కావాలంటూ చెక్కును తిప్పి పంపిన ఆర్టీసీ.. ఆ భూమి సాంకేతికంగా తమ పరిధిలోనే ఉందని భావించింది.
తాజాగా ఈ స్థలంలోనే రూ.16 కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఏడాదికి రూ.వెయ్యి చెల్లించేలా ముప్పైమూడున్నర ఏళ్లకు వైకాపా జిల్లా కార్యాలయానికి లీజుకిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆవిర్భవించిన వెంటనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైకాపాకు భూమి లీజుకు కేటాయించే తతంగం రహస్యంగా సాగింది. గుట్టుచప్పుడు కాకుండా బాపట్ల తహశీల్దారు ఈ నెల 15న రెండెకరాల భూమిని వైకాపాకు అప్పగించారు. వైకాపా జిల్లా కార్యాలయ నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేసే వరకు ఆర్టీసీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వలేదు.
అభ్యంతరం చెప్పినందుకే చర్యలు!
ఆర్టీసీ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మాణంపై ఆర్ఎం విజయ్కుమార్రెడ్డి, బాపట్ల డిపో మేనేజర్ శ్రీనివాసరెడ్డి జిల్లా వైకాపా కన్వీనర్, ఎంపీ మోపిదేవి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారంటూ పట్టణ పోలీస్స్టేషన్, స్థానిక తహశీల్దారుకు ఈ నెల 19న డీఎం ఫిర్యాదు చేశారు. వైకాపా కార్యాలయ నిర్మాణంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తారా.. అంటూ ఆర్ఎం, డీఎంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కారాలు మిరియాలు నూరారు. బాపట్లలో ఎలా పని చేస్తారో చూస్తామంటూ అంతర్గత సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డిని డిపో మేనేజరు బాధ్యతల నుంచి తప్పించి, పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. బాపట్లలో తమ సంస్థ భూమిలో వైకాపా కార్యాలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిరసన తెలిపామని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియా ముందు ప్రకటించారు. సాయంత్రానికే మాట మార్చేసి.. ఆ స్థలం తమది కాదంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇలా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు కలిసి డీఎంను బలిపశువును చేశారని, తద్వారా తాము అడ్డగోలుగా చేసే పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వేటు తప్పదంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లయిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
బాధ్యతాయుతంగా పనిచేసిన డీఎం బదిలీ అన్యాయం
ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్
ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపు అంశంలో బాపట్ల డీఎంను బదిలీ చేయడం అన్యాయమని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్కే జిలాని బాషా, అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య, ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఆ స్థలాన్ని ఏపీఐఐసీ తీసుకొని, రెవెన్యూశాఖకు బదలాయించినట్లు ఆర్టీసీ వద్ద రాతపూర్వక ఆధారాలేవీ లేవన్నారు. అటువంటప్పుడు ఆ స్థలం ఆర్టీసీదిగానే భావిస్తారని తెలిపారు. ఆ స్థలాన్ని కాపాడేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కలెక్టర్ వివరణ ఇచ్చాక ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆయన్ను బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.