ఇంటర్మీడియట్లో 66.21% ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 66.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 5,38,327 మంది ఉత్తీర్ణత సాధించారు.
మొదటి ఏడాదిలో బాలికలు 65%, బాలురు 58% ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75%, బాలురు 68% పాస్
ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఫలితాల్లో అమ్మాయిలే టాప్
అబ్బాయిలు అటూ ఇటూ తిరగడం వల్లే ఉత్తీర్ణతలో వెనకబడ్డారన్న బొత్స
అట్టడుగున సీఎం జగన్, మంత్రి బొత్స జిల్లాలు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 66.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 5,38,327 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది 4,33,275 మంది పరీక్షలు రాయగా.. 2,66,326 (61%) మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 3,79,758 మంది పరీక్షలకు హాజరవగా.. 2,72,001 (72%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ ఫలితాలను బుధవారం విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 65%, బాలురు 58% ఉత్తీర్ణులు కాగా.. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 75%, బాలురు 68% పాసయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, కడప చివరి స్థానంలో నిలిచాయి. రెండో ఏడాది ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలోనూ, విజయనగరం జిల్లా అట్టడుగున నిలిచాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప, విద్యాశాఖ మంత్రి బొత్స ఇలాకా విజయనగరం జిల్లాలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో అట్టడుగున నిలవడం గమనార్హం. వృత్తి విద్యా కోర్సుల్లో మొదటి ఏడాదిలో 49%, రెండో సంవత్సరంలో 62%మంది ఉత్తీర్ణులయ్యారు.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది మొదటి సంవత్సరంలో 54%, ద్వితీయ సంవత్సరంలో 61% మంది ఉత్తీర్ణులు కాగా.. ఈసారి వరసగా 61%, 72%మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 2018 తర్వాత, ద్వితీయ సంవత్సరంలో 2017 తర్వాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత.
విజయనగరాన్ని ముందుకు తీసుకొస్తాం
ఇంటర్మీడియట్లో బాలురు అటూ ఇటూ తిరుగుతూ చదవకపోవడం వల్లే ఉత్తీర్ణతలో వెనుకబడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాలికలు బాగా చదువుకోవడం వల్లే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారన్నారు. రెండో ఏడాది ఫలితాల్లో అట్టడుగున నిలిచిన విజయనగరాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఎక్కడ లోపం ఉందో పరిశీలిస్తామని వెల్లడించారు. ఇంటర్మీడియట్ మార్కులు, ర్యాంకులు ప్రకటనలపై నిషేధం ఉందని, గతంలోనే దీనిపై ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు. ఇంటర్మీడియట్లో రెసిడెన్షియల్లో ప్రైవేటు కంటే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత ఎక్కువగా ఉందని, ఇతర ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు సైతం ప్రభుత్వ బడుల్లా ఉండాలని తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.
ఆన్లైన్లో పాఠ్యపుస్తకాలు
ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ, నాడు-నేడు అమలు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. గతంలో పోల్చితే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, దీనికి సంతోషిస్తున్నామని తెలిపారు. చదువుకునే పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నామని, ఎక్కడ చదివించుకోవాలన్నది తల్లిదండ్రుల ఇష్టమని వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాలు బాగున్నాయని, తగ్గినట్లు మీడియా చెబుతున్నందున మరోసారి ఆ వివరాలను ప్రత్యేకంగా అందిస్తానని తెలిపారు. 1-10 తరగతి వరకు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్లను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వెబ్సైట్లో పీడీఎఫ్ల అప్లోడ్ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లోని 42 లక్షల మంది పిల్లలకు 3.16 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. చదువుకోవడం కోసం ఈ పాఠ్య పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ సురేష్ చెప్పారు. అయితే ముద్రణకు, మార్పులు చేసి గైడ్లుగా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు