ఆర్సెలర్‌ మిత్తల్‌కు కొత్త సీఈఓ.. ఎవరంటే

ఆర్సెలర్‌ మిట్టల్‌ నూతన ఛైర్మన్‌, సీఈఓగా ఆదిత్య మిట్టల్‌ను ప్రకటించారు.

Updated : 11 Feb 2021 19:35 IST

ఛైర్మన్‌, సీఈఓగా నియమితులైన ఆదిత్య మిత్తల్‌

లక్సెంబర్గ్‌: ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్‌ మిత్తల్‌ నూతన ఛైర్మన్‌, సీఈఓగా ఆదిత్య మిత్తల్‌ను ప్రకటించారు. తన తండ్రి, కంపెనీ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన లక్ష్మీ మిత్తల్‌ నుంచి ఆయన ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా, లక్ష్మీ మిత్తల్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. లక్సెంబర్గ్‌ ప్రధాన కేంద్రంగా గల ఈ దిగ్గజ సంస్థ అరవై దేశాల్లో స్టీలు, మైనింగ్‌ కార్యకలాపాలతో తన ఉనికిని చాటుకుంది.. పదిహేడు దేశాల్లో ఉక్కునిర్మాణ రంగంలో ఉంది. 2006లో ఆర్సెలర్‌ సంస్థతో మిత్తల్‌ స్టీల్‌ విలీనమై ప్రస్తుతమున్న ఆర్సెలర్‌ మిత్తల్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఆదిత్య  ప్రస్తుతం ఆర్సెలర్‌ మిత్తల్‌ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా వ్యవహరిస్తున్నారు. ఈయనను సంస్థ సీఈఓ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. 46 ఏళ్ల ఆదిత్య  1997లో ఆర్సెలర్‌ మిత్తల్‌లో చేరారు. అంతకు ముందు ఆయన క్రెడిట్‌ సుజీ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలో పనిచేశారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంలో అన్ని రంగాలపై, సంస్ధలపై పడినా.. ఆర్సెలర్‌ మిత్తల్‌ నాలుగవ త్రైమాసికంలో పుంజుకుని లాభాల బాట పట్టడం గమనార్హం.

ఇవీ చదవండి..

ఒడిదుడుకులను దాటుకుని లాభాల్లోకి..

మహిళా ఉక్కు సంకల్పం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని