Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత శుక్రవారం రూ.441 మేర పెరిగిన బంగారం ధర సోమవారం అదేస్థాయిలో.....
దిల్లీ: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత శుక్రవారం రూ.441 మేర పెరిగిన బంగారం ధర సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది. క్రితం ట్రేడింగ్లో 10గ్రాముల బంగారం ధర రూ.48,169గా ఉంది.
మరోవైపు, వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధరపై రూ.723లు తగ్గడంతో ప్రస్తుతం రూ.71,143 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయ పసిడి మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఈ హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1858 డాలర్లుగా ఉండగా.. ఔన్సు వెండి ధర 27.70డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. ఇకపోతే, హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,760కి (అన్ని ట్యాక్స్లతో కలిపి) పైగా పైగా ట్రేడ్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!