బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు
అన్ని బీమా సంస్థలు మార్చి 1 న సర్క్యులర్లో జారీ చేసిన సూచనలను త్వరగా పాటించాల్సి ఉంటుంది
పాలసీదారులతో సంబంధాల కొనసాగింపు, ప్రామాణిక పద్ధతిలో సమాచారాన్ని అందించడానికి పాలసీదారులకు నిర్థిష్ట వ్యవధిలో నోటీసులు పంపించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నిబంధనలు జారీ చేసింది.
పాలసీదారులకు బీమా సంస్థలు, ఆరోగ్య బీమా కవరేజీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలి. మార్చి 1 న ఐఆర్డీఏఐ జారీ చేసిన సర్క్యులర్లో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చర్యలు ప్రారంభించాలి, మొత్తానికి 2021 జూన్ 1 లోపు జారీ చేసిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఐఆర్డీఏఐ నిబంధనలు అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు వర్తిస్తాయి.
పాలసీ సర్వీసింగ్లో భాగంగా, బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాలి. వీటిలో పాలసీ సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం బీమా, కవరేజ్ పరిధి, పాలసీ పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య, పాలసీ వ్యవధి, సెటిల్ చేసిన క్లెయిమ్ల మొత్తం (ఆ వ్యవధిలో), మిగతా బీమా హామీ, బోనస్ ఏదైనా ఉంటే మొత్తం అన్ని వివరాలు ఉండాలి.
సమాచారం పునరుద్ధరణ, ప్రీమియం చెల్లింపు వ్యవధి, పునరుద్ధరణకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం (పునరుద్ధరణ సమయంలో పేర్కొనబడాలి), గ్రేస్ పీరియడ్ (పునరుద్ధరణ గడువు తేదీ తర్వాత 5 రోజులలోపు), సంప్రదింపు వివరాలు (ఏదైనా సమాచారం కోసం) బీమా సంస్థ, పాలసీదారు సంబంధిత సేవ, టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడి వంటివి చేర్చాలి.
పాలసీదారులకు సంవత్సరానికి రెండుసార్లు సమాచారం ఇవ్వాలి, అంటే పాలసీ జారీ చేసిన ఆరు నెలల తరువాత, పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం ఒక నెల ముందు ఈ వివరాలు తెలియజేయాలి. అయితే మల్టీఇయర్ పాలసీ విషయంలో, పాలసీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో సమాచారాన్ని పంచుకోవచ్చని సర్క్యులర్ తెలిపింది.
ఆరోగ్య బీమా పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ పరిష్కారం అయిన సందర్భంలో, బీమా మొత్తానికి సంబంధించిన వివరాలతో పాటు అందుబాటులో ఉన్న సంచిత బోనస్తో ఏదైనా ఉంటే పాలసీదారునికి తెలియజేయాలి. దావా పరిష్కరించిన 15 రోజుల్లోపు ఇది పాలసీదారులకు తెలియజేయాలి.
ఐఆర్డీఏఐ సర్క్యులర్ ప్రకారం, బీమా సంస్థ సమాచారాన్ని తెలియజేయడానికి ఏదైనా కమ్యూనికేషన్ పద్ధతిని (సందేశం, ఇ-మెయిల్, లేఖ మొదలైనవి) ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్