సీనియర్ సిటిజన్ల కోసం పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఎల్ఐసీ...
ఈ పథకాన్ని ఆఫ్లైన్లో, ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు
సీనియర్ సిటిజన్ల కోసం పీఎం వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన తరువాత, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కేంద్రం సబ్సిడీతో అనుసంధానించని పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇటీవలే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెన్షన్ ప్లాన్ ను 7.40 శాతం వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు పొడిగించింది.
ఈ ప్లాన్ మూడు ఆర్థిక సంవత్సరాలు అనగా మార్చి 2023 వరకు విక్రయానికి అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని ఆఫ్లైన్లో, ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. మొత్తం చెల్లింపును రూ. 15 లక్షలకు మించకుండా అందించే పథకాన్ని అమలు చేసే అధికారం ఎల్ఐసీకి మాత్రమే ఉంది.
ఈ పాలసీకి 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకం సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, అయితే మొత్తం 10 సంవత్సరాల కాలానికి నెలవారీగా చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా నెలకు రూ. 1000 కనీస పెన్షన్ పొందవచ్చు. గరిష్ట పెన్షన్ మొత్తం నెలకు రూ. 10,000 గా పరిమితం చేశారు.
రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో విక్రయించే పాలసీలకు వర్తించే వడ్డీ రేటు, ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం సమీక్షించి, నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడిని రూ. 1,56,658 గా, అలాగే నెలకు రూ. 1000 పొందటానికి కనీస పెట్టుబడిని రూ. 1,62,162 కు సవరించారు.
నెలవారీ మోడ్ కోసం కనీస కొనుగోలు ధర రూ. 1,62,162, త్రైమాసిక పెన్షన్ కోసం రూ. 1,61,074, అర్ధ వార్షిక మోడ్కు రూ. 1,59,574, వార్షిక మోడ్కు రూ. 1,56,658. ఈ పథకం కింద పొందగలిగే గరిష్ట పెన్షన్ నెలకు రూ. 9,250, త్రైమాసికానికి రూ. 27,750, అర్ధ సంవత్సరానికి రూ. 55,500, వార్షిక చెల్లింపు ప్రాతిపదికన రూ. 1,11,000 అని ఎల్ఐసీ తెలిపింది.
ఈ ప్రణాళికలోని అన్ని పాలసీల కింద మొత్తం కొనుగోలు ధర, సీనియర్ సిటిజన్కు అనుమతించిన పథకం మునుపటి సంస్కరణల కింద తీసుకున్న అన్ని పాలసీలు రూ. 15 లక్షలకు మించకూడదు.
ఈ పథకాన్ని ఒకేసారి పూర్తి మొతాన్ని చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అలాగే పెన్షనర్కు పెన్షన్ మొత్తాన్ని లేదా కొనుగోలు ధరను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పథకాన్ని కొనుగోలు చేసే సమయంలో పెన్షనర్ నెలవారీ / త్రైమాసిక / అర్ధ వార్షిక లేదా వార్షిక పెన్షన్ మోడ్ను ఎంచుకోవచ్చు.
పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ జీవించి ఉన్నట్లయితే, బకాయిల్లో పింఛను (ఎంచుకున్న మోడ్ ప్రకారం ప్రతి వ్యవధి చివరలో) చెల్లిస్తారని, ఒకవేళ పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ మరణించినట్లైతే, కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇస్తారని ఎల్ఐసీ తెలిపింది.
ఒకవేళ పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యే వరకు పెన్షనర్ జీవించి ఉన్నట్లైతే, కొనుగోలు ధర, తుది పెన్షన్ వాయిదా చెల్లించాలి.
మూడు పాలసీ సంవత్సరాల తరువాత కొనుగోలు ధరలో 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు.
ఈ పథకం స్వీయ లేదా జీవిత భాగస్వామి క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స కోసం ముందస్తు నిష్క్రమణను అనుమతిస్తుంది, అలాగే చెల్లించాల్సిన సరెండర్ విలువ కొనుగోలు ధరలో 98 శాతంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్