ఒపెక్‌ దేశాల నుంచి ఆక్సిజన్‌ సరఫరా

కొవిడ్‌-19 మహమ్మారిపై పోరు సాగించేందుకు అవసరమైన వైద్య అవసరాలకు ఉపయోగపడే ఆక్సిజన్‌ కోసం భారత్‌ ఒపెక్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ల వైపు చూస్తోంది.   కేంద్ర చమురు శాఖ మంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు

Published : 08 May 2021 01:28 IST

 కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారిపై పోరు సాగించేందుకు అవసరమైన వైద్య అవసరాలకు ఉపయోగపడే ఆక్సిజన్‌ కోసం భారత్‌ ఒపెక్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ల వైపు చూస్తోంది.   కేంద్ర చమురు శాఖ మంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారత్‌కు వైద్య ఆక్సిజన్‌ ఎగుమతి చేసేందుకు యూఏఈ, కువైట్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలు అంగీకరించినట్లు మంత్రి ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. ఐఓసీ, గెయిల్‌లు ఆక్సిజన్‌ రవాణాకు లాజిస్టిక్స్‌ సమకూరుస్తాయని తెలిపారు.
వేగంగా కొవిడ్‌-19 వనరుల బదిలీ

కస్టమ్స్‌తో తపాలా శాఖ జట్టు
దిల్లీ: ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, పరికరాలు, ఔషధాలు వంటి కొవిడ్‌-19 వనరులను వేగంగా క్లియర్‌ చేయడం, ప్రాసెసింగ్‌, బదిలీ కోసం కస్టమ్స్‌ సంస్థలతో తపాలా శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొవిడ్‌-19 వనరుల డెలివరీ వేగవంతానికి కన్‌సైన్‌మెంట్‌ వివరాలను ఇ-మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా నోడల్‌ అధికారులకు పంపించాల్సిందిగా వినియోగదారులను తపాలా శాఖ కోరింది. కన్‌సైన్‌మెంట్‌ పేరు, మొబైల్‌ సంఖ్య, ఇ-మెయిల్‌ ఐడీ, ట్రాకింగ్‌ ఐడీ, పంపిన తేదీ, డెలివరీ చిరునామా వంటి వాటిని ఇ-మెయిల్‌ ద్వారా పంపమని సూచించింది. రెండు ఇ-మెయిల్‌ ఐడీలు
adgim2@indiapost.gov.inand dop.covid19@gmail.com లను తపాలా శాఖ పేర్కొంది. నోడల్‌ అధికారులుగా అరవింద్‌ కుమార్‌, పునీత్‌ కుమార్‌లను నియమించిన సంస్థ.. వీరిని 98683378497, 9536623331లపై సంప్రదించొచ్చని వెల్లడించింది.
సంక్షిప్తంగా..
*సేవలు అందించే నెఫ్రోప్లస్‌ పుణేలో ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో చాలామంది డయాలసిస్‌ రోగులకు ఇబ్బంది ఎదురవుతున్న దృష్ట్యా అంబులెన్స్‌లోనే ఈ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని