Apple India revenue: భారత్లో రెండింతలైన ‘యాపిల్’ ఆదాయం
Apple India revenue: టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఆదాయం భారత్లో దాదాపు రెండింతలు కావడం విశేషం....
న్యూయార్క్: టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఆదాయం జూన్తో ముగిసిన త్రైమాసికంలో రెండు శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో భారత్లో కంపెనీ ఆదాయం దాదాపు రెండింతలు కావడం విశేషం. ఈసారి ఆదాయం తమ అంచనాలను మించిందని సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, విదేశీ మారకంలో బలమైన ప్రతికూలతలు, రష్యాలో సంస్థ వ్యాపారంపై ఎదురుదెబ్బ వంటి సవాళ్లున్నప్పటికీ.. మూడో త్రైమాసికంలో బలమైన ఆదాయం నమోదైందని తెలిపారు.
అమెరికా, ఐరోపా, ఇతర ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో తమ కంపెనీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైందని టిమ్ కుక్ వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైందని తెలిపారు. భారత్తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాం దేశాల్లో ఆదాయం రెండింతలైందని పేర్కొన్నారు. ఈ దేశాల్లో ఆదాయాలకు ఐఫోన్ విక్రయాలు కీలకంగా నిలిచాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంకా ఐఫోన్ అమ్మకాలు తక్కువగానే ఉన్నాయన్నారు. ఆయా ప్రదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికలు కొనసాగుతాయని వివరించారు.
కంపెనీకి సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు సీఎఫ్ఓ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ల్యూకా మేస్ట్రీ తెలిపారు. ఇది వివిధ దేశాల్లో తమ పోర్ట్ఫోలియో ఎంత బలంగా ఉందో నిరూపిస్తోందన్నారు. వివిధ కంపెనీలు యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై పెట్టుబడులను పెంచుతున్నాయని తెలిపారు. అందుకు విప్రోను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి దీన్ని వారొక వ్యూహంగా ఉపయోగించుకుంటున్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్