మరోసారి ఎగబాకిన ఇంధన ధరలు
దేశంలో ఇంధన ధరలు శనివారం మరోసారి ఎగబాకాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్
దిల్లీ: దేశంలో ఇంధన ధరలు శనివారం మరోసారి ఎగబాకాయి. దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్పై 25పైసలు వరకు పెంచాయి. కాగా కేవలం ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి. దిల్లీలో పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 15 పైసలు పెంచాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17గా, డీజిల్ ధర రూ.81.47గా నమోదైంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.57, డీజిల్ రూ.88.70కి చేరుకుంది.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 25పైసలు, డీజిల్పై 17పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.94.79, డీజిల్ ధర రూ.88.86గా నమోదైంది. గడిచిన 30 రోజుల్లో రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.5 పెరగడం గమనార్హం. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గత 58రోజుల్లో చమురు ధరలు 26సార్లు పెరగడం గమనార్హం.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్