మహీంద్రా బొలెరో మ్యాక్స్‌ పికప్‌

మహీంద్రా అండ్‌ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) మ్యాక్స్‌ పికప్‌ను బుధవారం ఆవిష్కరించింది. 2-3.5 టన్నుల విభాగంలో పరిచయం చేస్తున్న ఈ వాహన శ్రేణి ధర రూ.7.68-7.87 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంటుంది. ఈ విభాగంలో మార్కెట్‌ వాటా

Published : 11 Aug 2022 05:15 IST

ధరల శ్రేణి రూ.7.68-7.87 లక్షలు

చెన్నై: మహీంద్రా అండ్‌ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్‌సీవీ) మ్యాక్స్‌ పికప్‌ను బుధవారం ఆవిష్కరించింది. 2-3.5 టన్నుల విభాగంలో పరిచయం చేస్తున్న ఈ వాహన శ్రేణి ధర రూ.7.68-7.87 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంటుంది. ఈ విభాగంలో మార్కెట్‌ వాటా పెంచుకునేందుకే ఈ మోడల్‌ను తెస్తున్నట్లు ఎంఅండ్‌ఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. పుణె సమీపంలోని చకాన్‌ ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మ్యాక్స్‌ పికప్‌ ప్రారంభస్థాయి మోడల్‌ ధర రూ.7.68 లక్షలు, మిడ్‌ వేరియంట్‌ ధర రూ.7.72 లక్షలు, టాప్‌-ఎండ్‌ ధర రూ.7.87 లక్షలుగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.25,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రుణంగా పొందొచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని