సానుకూలతలున్నాయ్ కానీ..
దేశీయ సూచీలు ఈ వారం సానుకూలతలు కనబరచవచ్చని, అయితే భారీ లాభాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 17,500-17,900 శ్రేణిలో నిఫ్టీ-50 కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొంత దిద్దుబాటు చోటుచేసుకున్నా, సానుకూలంగానే చూడాలంటున్నారు. ఫలితాల
స్టాక్ మార్కెట్ ఈ వారం
లాభాల స్వీకరణకూ అవకాశం
చమురు, బ్యాంకు షేర్లు రాణించొచ్చు
అంతర్జాతీయ మార్కెట్లే కీలకం
విశ్లేషకుల అంచనాలు
దేశీయ సూచీలు ఈ వారం సానుకూలతలు కనబరచవచ్చని, అయితే భారీ లాభాలు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 17,500-17,900 శ్రేణిలో నిఫ్టీ-50 కదలాడొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొంత దిద్దుబాటు చోటుచేసుకున్నా, సానుకూలంగానే చూడాలంటున్నారు. ఫలితాల సీజను ముగింపునకు వచ్చినందున, దిశానిర్దేశం కోసం మదుపర్లు అంతర్జాతీయ మార్కెట్ల వైపు చూడొచ్చు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ప్రభావం చూపొచ్చు. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ జులై సమావేశ వివరాలు ఈ వారంలో వెలుగు చూస్తాయి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* చాలా వరకు సిమెంటు కంపెనీలు జూన్ త్రైమాసికానికి బలహీన ఫలితాలకు తోడు, భవిష్యత్తు అంచనాలు కూడా అలానే ప్రకటించిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు మరింత ఊగిసలాటలకు గురికావొచ్చు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లు ఒత్తిడిలో కొనసాగొచ్చు. అనిశ్చితి వల్ల కొద్ది నెలలుగా ఈ రంగ షేర్లు రక్షణాత్మక ధోరణిని కనబరచాయి.
* యంత్ర పరికరాల కంపెనీలు రికార్డు స్థాయి ఆర్డర్లను నమోదు చేశాయి. వాటిని పూర్తి చేసే అంశంపై ఇచ్చే ప్రకటనల కోసం ఎదురు చూస్తారు.
* ఓఎన్జీసీ లాభం మూడింతలైన నేపథ్యంలో చమురు షేర్లు రాణించొచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరల కనుగుణంగా అప్స్ట్రీమ్ కంపెనీల షేర్లు కదలాడొచ్చు.
* బ్యాంకు షేర్లలో సానుకూల చలనాలు కనిపించొచ్చు. పలు బ్యాంకులు బలమైన రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యతను నమోదు చేయడం ఇందుకు దోహదం చేయొచ్చు. పడినపుడల్లా షేర్లను పోగు చేసుకోవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి.
* ఔషధ షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. కంపెనీలు కొత్త ఆవిష్కరణల వేగాన్ని పెంచుకోగలవా లేదా అన్నదానిని మదుపర్లు గమనించొచ్చు.
* ఐటీ కంపెనీల షేర్లలో పెద్దగా కదలికలు ఉండకపోవచ్చు. అమెరికా, ఐరోపాలలో మాంద్యం ఏర్పడవచ్చన్న అనుమానాల నేపథ్యంలో గిరాకీ ధోరణులను గమనించాలి. నేడు ఏజీఎమ్ జరగనున్నందున హెచ్సీఎల్ టెక్నాలజీస్పై దృష్టి పడొచ్చు.
* వాహన కంపెనీల షేర్లు మార్కెట్ నుంచే సంకేతాలు అందుకోవచ్చు. సెమీకండక్టర్ సరఫరా పెరుగుతుండడం; పండుగల సీజనులో విక్రయాలు రాణిస్తాయన్న అంచనాలతో ఈ రంగంపై సానుకూలతలు కనిపిస్తున్నాయి.
* లోహ షేర్లలో ఒత్తిడి కనిపించొచ్చు. అంతర్జాతీయంగా ఉక్కు అధిక సరఫరాపై ఆందోళనలు ఇందుకు కారణం. హిందాల్కో, సెయిల్ యాజమాన్య వ్యాఖ్యలు ప్రభావం చూపొచ్చు.
* టెలికాం షేర్లు మార్కెట్తో పాటే కదలాడొచ్చు. 5జీ సేవల ప్రారంభ పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. భారతీ ఎయిర్టెల్పై విశ్లేషకులు ‘బులిష్’ ధోరణితో ఉన్నారు. స్పెక్ట్రమ్కు సంబంధించి కంపెనీలు తొలి వాయిదాను ఈనెల 17న చెల్లించాల్సి ఉంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మన ఈక్విటీ, ఫారెక్స్, బులియన్, కమొడిటీ మార్కెట్లు పనిచేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!