61000- 61500 శ్రేణి కీలకం!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ భయాలు, సాధారణ బడ్జెట్, ఎఫ్ఐఐ అమ్మకాలు, రూపాయి బలహీనతల ప్రభావంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో గత వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ భయాలు, సాధారణ బడ్జెట్, ఎఫ్ఐఐ అమ్మకాలు, రూపాయి బలహీనతల ప్రభావంతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. దేశీయంగా చూస్తే.. సాధారణ బడ్జెట్లో ప్రకటించిన మూలధన వ్యయాలు, పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం వంటివి మదుపర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓను వెనక్కి తీసుకోవడంతో గ్రూప్ షేర్లు కుదేలయ్యాయి. డిసెంబరు సేవల రంగ పీఎంఐ నెమ్మదించింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్ ముడిచమురు 7.8 శాతం తగ్గి 79.9 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 81.52 నుంచి 81.82కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచి 4.5%-4.75% చేసింది. ధరల స్థిరత్వం వచ్చేవరకు అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయని ఫెడ్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా వడ్డీ రేట్లు 0.5% పెంచింది. చైనా పారిశ్రామిక కార్యకలాపాలు వరుసగా ఆరో నెలా నీరసించాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 2 శాతానికి పైగా లాభంతో 60,842 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం రాణించి 17,854 పాయింట్ల దగ్గర స్థిరపడింది. మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ రంగాలు లాభపడగా.. విద్యుత్, చమురు-గ్యాస్, ఆరోగ్య సంరక్షణ షేర్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.14,444 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.14,184 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) ఈక్విటీల నుంచి నికరంగా రూ.28,852 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత 7 నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో బలహీనతలను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గత వారం 58000-59000 పాయింట్ల శ్రేణిలో మద్దతు తీసుకున్న సెన్సెక్స్, లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం కీలక నిరోధమైన 61000-61500 శ్రేణి దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఈ స్థాయిని అధిగమిస్తే ప్రస్తుత రికవరీ 63000 పాయింట్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు 59,800 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు.
ప్రభావిత అంశాలు: కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నుంచి దేశీయ మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లు పెంచొచ్చని, అయితే వేగాన్ని తగ్గించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అదానీ గ్రూప్ పరిణామాలపై మార్కెట్లు దృష్టిపెట్టొచ్చు. సూచీల్లో కొంత ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా.. డిసెంబరు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనున్నాయి. బ్యాంక్ డిపాజిట్లు, రుణాల వృద్ధి గణాంకాలపై కన్నేయొచ్చు. ఈ వారం టాటా స్టీల్, ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఎల్ఐసీ, లుపిన్, అరబిందో ఫార్మా, వోల్టాస్, ఎం అండ్ ఎం, భెల్, అదానీ పోర్ట్స్, అంబుజా, పిరమాల్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, జొమాటో వంటి కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. యూరో ఏరియా రిటైల్ విక్రయాలు, కెనడా పీఎంఐ, అమెరికా ఎగుమతులు- దిగుమతులు, చైనా ద్రవ్యోల్బణం, బ్రిటన్ జీడీపీ, అమెరికా వినియోగదారు విశ్వాసం, ఆస్ట్రేలియా వడ్డీ రేట్ల నిర్ణయం విడుదల కానున్నాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 60,000, 59,200, 58,700
తక్షణ నిరోధ స్థాయులు: 61,266, 62,000, 62,836
సెన్సెక్స్ 61,000-61500 శ్రేణి అధిగమిస్తేనే లాభాలు కొనసాగే అవకాశం ఉంటుంది.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM