రిలయన్స్, బ్యాంకింగ్ షేర్లు నడిపించాయ్
సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లను నడిపించాయి.
సమీక్ష
సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. క్రెడిట్ సూయిజ్ సంక్షోభం సద్దుమణగడం సానుకూల ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 82.59 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.65% పెరిగి 74.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 57,963.27 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో రోజంతా అదే దూకుడు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 58,133.33 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 445.73 పాయింట్ల లాభంతో 58,074.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 119.10 పాయింట్లు పెరిగి 17,107.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,016- 17,127.70 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. రిలయన్స్ 3.11%, బజాజ్ ఫైనాన్స్ 2.88%, టైటన్ 2.15%, యాక్సిస్ బ్యాంక్ 2.14%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.94%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.89%, బజాజ్ ఫిన్సర్వ్ 1.73%, అల్ట్రాటెక్ 1.53%, ఎల్ అండ్ టీ 1.38%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.17% చొప్పున మెరిశాయి. పవర్గ్రిడ్ 2%, హెచ్యూఎల్ 1.88%, టెక్ మహీంద్రా 1.19%, టీసీఎస్ 1.12%, ఇన్ఫోసిస్ 0.91% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు 1.57%, ఇంధన 0.99%, విద్యుత్ 0.74%, కమొడిటీస్ 0.71%, టెలికాం 0.63% రాణించాయి. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, స్థిరాస్తి, టెక్ నిరాశపరిచాయి. బీఎస్ఈలో 1978 షేర్లు లాభాల్లో ముగియగా, 1550 స్క్రిప్లు నష్టపోయాయి. 120 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఈ ఏడాది సెప్టెంబరు 15 తరవాత సలహాదారు పదవిలో సంస్థలో కొనసాగాల్సిందిగా టీసీఎస్ ఎండీ, సీఈఓ రాజేశ్ గోపీనాథన్తో టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎండీ పదవికి రాజీనామా చేసిన రాజేశ్, బాధ్యతల బదిలీ సాఫీగా సాగేందుకు సెప్టెంబరు వరకు కొనసాగుతానని వెల్లడించిన సంగతి విదితమే.
* తమ హైడ్రోకార్బన్ వ్యాపారం రూ.5000-7000 కోట్ల శ్రేణిలో ప్రధాన ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది.
* గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం భారత సైన్యంతో ఎన్టీపీసీ విభాగమైన ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది.
* 2022-23 ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్గా ఒక్కో షేరుకు రూ.26 చెల్లించేందుకు హిందుస్థాన్ జింక్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.10,985.83 కోట్లు వెచ్చించనుంది.
* బెంగళూరుకు చెందిన కృత్రిమమేధ సంస్థ ప్లూటూరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ ప్రకటించింది. లావాదేవీ మొత్తాన్ని వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM