రూ.164 లక్షల కోట్ల ఎగుమతులు!
దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
2030 లక్ష్యం
కొత్త విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ
ఇ-కామర్స్ ఎగుమతులకూ ప్రయోజనాలు
రూపాయల్లో వాణిజ్యం పెంచడంపై దృష్టి
దిల్లీ: దేశ ఎగుమతులను 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.164 లక్షల కోట్ల)కు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్టీపీ) కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఫారిన్ ట్రేడ్ డైరెక్టరు జనరల్ (డీజీఎఫ్టీ) సంతోష్ సారంగి కొత్త ఎఫ్టీపీ ప్రత్యేకతలను విలేకర్లకు తెలియజేశారు. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడం, ఇ-కామర్స్ ఎగుమతులకూ ప్రయోజనాలు వర్తింపజేయడం కొత్త ఎఫ్టీపీ ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. రాష్ట్రాలు, జిల్లాల్లోని ఎగుమతిదార్లు, విదేశాల్లోని భారత రాయబార్ల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, లావాదేవీల వ్యయాలు తగ్గించడం, మరిన్ని ఎగుమతి కేంద్రాల అభివృద్ధికి ఇందులో ప్రాధాన్యమిచ్చారు.
తుది తేదీ లేదు
సాధారణంగా ఎఫ్టీపీలను అయిదేళ్ల కాలానికి ప్రకటిస్తుంటారు. ఈసారి అలాంటి గడువేమీ లేకుండా, ఎప్పటికీ కొనసాగేలా.. పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునేలా (డైనమిక్ అండ్ రెస్పాన్సివ్) ఈ కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. రంగాలవారీగా లేదంటే దేశీయ ఉత్పత్తులను, సేవలను ప్రపంచానికి చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు, సేవల ఎగుమతులు 765 బిలియన్ డాలర్ల విలువను అధిగమించే అవకాశం ఉందని డీజీఎఫ్టీ తెలిపింది. 2021-22లో ఇవి 676 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి..
మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే ఉద్దేశంతో, రూపాయల్లో వాణిజ్య చెల్లింపులకు అనుమతినిచ్చేలా ఎఫ్టీపీలో మార్పులు చేశారు. ‘కరెన్సీ సంక్షోభాలు లేదా డాలర్ల కొరత ఎదుర్కొంటున్న దేశాలతో రూపాయల్లో వాణిజ్యాన్ని జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉంద’ని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వాల్ తెలిపారు. మన ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడు రాయితీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై మాత్రమే పరిశ్రమ విజయం ఆధారపడి ఉండదని పీయూష్ గోయల్ తెలిపారు.
200- 300 బి.డాలర్లకు ఇ-కామర్స్ ఎగుమతులు
2030 కల్లా ఇ-కామర్స్ ఎగుమతులు 200- 300 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఎఫ్టీపీ అంచనా వేసింది. కొరియర్ ద్వారా ఎగుమతుల విలువ పరిమితిని ఒక్కో ప్యాకెట్కు రెట్టింపు చేసి రూ.10 లక్షలకు పెంచింది. ఇ-కామర్స్ సంస్థలకు సులభ స్టాకింగ్, కస్టమ్స్ అనుమతులు, రిటర్న్ల ప్రాసెసింగ్ విషయంలో తోడ్పాటు అందించేందుకు గిడ్డంగుల సదుపాయాలతో నిర్దేశిత జోన్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎఫ్టీపీకి సంబంధించిన దరఖాస్తుల డిజిటైజేషన్, ఆటోమేటిక్ సిస్టమ్ ఆధారిత అనుమతులు, అడ్వాన్స్ ఆథరైజేషన్ పొడిగింపు/ రీవ్యాలిడేషన్ దరఖాస్తులు ఒక్క రోజులో ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం పొడిగింపు, సగటు ఈవో (ఎక్స్ఫోర్ట్ ఆబ్లిగేషన్) నిర్వహణ నుంచి పాడి పరిశ్రమకు మినహాయింపు లాంటివీ కొత్త ఎఫ్టీపీలో చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM