- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కొత్త ఏడాదిలో కొలువుల కోలాహలం
నియామకాలకు ఎనిమిదేళ్లలోనే అత్యంత ఆశావహ స్థితి: మ్యాన్పవర్
దిల్లీ: కొత్త ఏడాది తొలి మూడు నెలల్లో దేశీయంగా కొలువుల కోలాహలం నెలకొంటుందని మ్యాన్పవర్ గ్రూపు ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ తాజా సర్వే పేర్కొంది. కొవిడ్-19 ముందు స్థాయికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని కంపెనీలు విశ్వసిస్తుండటమే ఇందుకు కారణమని సర్వే పేర్కొంది. నియామకాలకు ఇంత బలంగా సానుకూల పరిస్థితులు నెలకొనడం ఎనిమిదేళ్లలో ఇప్పుడేనని వెల్లడించింది. 3,020 సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయాలతో నివేదిక రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ ప్రకారం.. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటామని 64 శాతం కంపెనీలు తెలిపాయి. 15 శాతం కంపెనీలు సిబ్బందిని తగ్గించుకుంటామని చెప్పగా.. 20 శాతం కంపెనీలు సిబ్బంది సంఖ్యలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని తెలిపాయి. ఈ ప్రకారం నికరంగా 49 శాతం కంపెనీలు నియామకాలను పెంచుకునే ప్రణాళికలో ఉన్నట్లు తేలింది.
వినియోగం పెరగడం, విద్యా సంస్థల పునఃప్రారంభం, కొవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం వేగవంతంతో దేశ ఆర్థిక వ్యవస్థ వి-ఆకారంలో పుంజుకుందని మ్యాన్పవర్ గ్రూపు ఇండియా మేనేజింగ్ డైరెక్టరు సందీప్ గులేటి తెలిపారు. ఐటీ, సాంకేతిక రంగాల్లోని నియామకాలపై అదనంగా ‘గ్రేట్ రిజిగ్నేషన్’ (ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల నుంచి వైదొలగడం) ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు.
డిజిటల్కే అధిక గిరాకీ
చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీల్లోనే అధిక నియామకాలు చోటుచేసుకోవచ్చు. 51 శాతం పెద్ద కంపెనీలు, 15 శాతం చిన్న కంపెనీలు నియామకాలపై యోచన చేస్తున్నాయి. డిజిటల్ విభాగంలోని ఉద్యోగాలకే అధిక గిరాకీ ఉందని సర్వే గుర్తించింది. ఐటీ, టెక్నాలజీ, టెలికాం, కమ్యూనికేషన్స్, మీడియా రంగాల్లో అత్యధిక కంపెనీలు (60%) నియామకాల ప్రణాళికలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు (56%); బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, స్థిరాస్తి (52%) రంగాలు ఉన్నాయి.హైబ్రిడ్ పని విధానం వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
monkeypox: మంకీపాక్స్ నిర్ధారణ స్వదేశీ కిట్ విడుదల.. ఏపీలోనే తయారీ
-
India News
Nithyananda: నిత్యానందపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
-
General News
Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్రావు
-
Movies News
Chiranjeevi: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ.. జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్గా పంపించాలనే ఐడియా ఎవరిది..?