మారుతీ సెలెరియోలో ఎస్-సీఎన్జీ
సెలెరియో మోడల్లో సీఎన్జీ వేరియంట్ను విడుదల చేసినట్లు మారుతీ సుజుకీ సోమవారం వెల్లడించింది. దీని ధర రూ.6.58 లక్షలుగా (ఎక్స్షోరూమ్, దిల్లీ) నిర్ణయించింది. కె-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తో రూపొందిన
దిల్లీ: సెలెరియో మోడల్లో సీఎన్జీ వేరియంట్ను విడుదల చేసినట్లు మారుతీ సుజుకీ సోమవారం వెల్లడించింది. దీని ధర రూ.6.58 లక్షలుగా (ఎక్స్షోరూమ్, దిల్లీ) నిర్ణయించింది. కె-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తో రూపొందిన సరికొత్త సెలెరియోను ఎస్-సీఎన్జీ సాంకేతికతతో రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. కిలో సీఎన్జీతో 35.60 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని, సీఎన్జీ ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు ఉంటుందని పేర్కొంది. ‘దేశంలో పర్యావరణ హిత ఇంధనాలతో నడిచే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, మేము కూడా ఈ రంగంలో బలోపేతం అయ్యేందుకు సెలెరియోలో ఎస్-సీఎన్జీ సాంకేతికత తీసుకొచ్చామ’ని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, విక్రయాలు) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు