క్రాటోస్, క్రాటోస్-ఆర్ విద్యుత్ మోటార్సైకిళ్లు
భారత్ ఫోర్జ్ నేతృత్వంలోని విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టార్క్ మోటార్స్ క్రాటోస్, క్రాటోస్-ఆర్ మోటార్సైకిళ్లను విపణిలోకి విడుదల చేసింది.
ధరల శ్రేణి రూ.1.08-1.23 లక్షలు
ముంబయి: భారత్ ఫోర్జ్ నేతృత్వంలోని విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టార్క్ మోటార్స్ క్రాటోస్, క్రాటోస్-ఆర్ మోటార్సైకిళ్లను విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.1.08-1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, పుణె-రాయితీ తరవాత). ఆన్లైన్లో తమ వెబ్సైట్ ద్వారా క్రాటోస్ బుకింగ్లు చేసుకోవచ్చని, ఏప్రిల్ నుంచి డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. క్రాటోస్ 4 కిలోవాట్ బ్యాటరీతో, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించేలా ఉంటుంది. 4 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతో పాటు గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. హోమ్ ఛార్జర్తో ఇది లభిస్తుంది. దీని ద్వారా ఇంటి వద్ద ఛార్జింగ్ ప్లగ్ను ఇన్స్టాల్ చేసుకొని సులభంగా వాహనాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!