ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి...

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంది. ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ.. దీన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడం మంచిది. ప్రస్తుత మదింపు సంవత్సరం

Published : 06 Aug 2021 01:11 IST

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంది. ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ.. దీన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయడం మంచిది. ప్రస్తుత మదింపు సంవత్సరం (2021-22)లో పన్ను చెల్లింపుదారులు రెండు రకాల పద్ధతుల్లో ఒకటి ఎంచుకొని, రిటర్నులు సమర్పించేందుకు వీలుంది.

పాత పద్ధతిలో..

ఇప్పటివరకూ మనకు అలవాటైన విధానమే ఇది. పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. సెక్షన్‌ 80సీ, 80డీ, 80ఈ ఇలా పలు సెక్షన్ల కింద మినహాయింపులు పోను పన్ను వర్తించే మొత్తానికి నిర్ణీత శ్లాబుల మేరకు పన్ను చెల్లించాలి.

కొత్త పన్నుల విధానంలో..

వ్యక్తులు,  హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునేందుకు వీలుంది. 2020 బడ్జెట్‌లో దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ పద్ధతిలో పన్ను ఎలా ఉంటుందంటే..

మనమేం చేయాలి?

ఉద్యోగులు యాజమాన్యానికి ఏ పన్ను విధానం ఎంచుకుంటున్నామో ముందుగానే చెప్పాలి. అలా చేయకపోయినా ఇప్పుడు రిటర్నులు దాఖలు చేసుకునేటప్పుడు పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను శాఖ కల్పిస్తోంది.
రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ కొత్త, పాత పన్ను విధానాల్లో దేన్ని ఎంచుకుంటారనే ప్రశ్న ఉంటుంది. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, ఇంటి అద్దె, గృహరుణం వడ్డీలాంటివి క్లెయిం చేసుకోవద్దు అనుకుంటే కొత్త విధానంలోకి వెళ్లాలి. లేదా అన్ని సెక్షన్ల మినహాయింపులూ క్లెయిం చేసుకుంటాను అనుకుంటే పాత విధానమే ఎంచుకోవచ్చు.
మీరు రిటర్నులు దాఖలు చేసేటప్పుడు.. ముందుగా పాత విధానంలో పన్ను గణన పూర్తి చేయండి. ఎంత మేరకు రిఫండు లేదా పన్ను చెల్లించాల్సి వస్తోందన్నది చూసుకోండి. ఆ తర్వాత కొత్త పన్ను విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోండి. దీన్ని బట్టి ఏ విధానం వల్ల కలిసొస్తుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అనువైన పద్ధతిలో రిటర్నుల సమర్పణను పూర్తి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని