బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు కొత్త బాస్‌లు

ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాకుంల్లో కొత్త అధిపతులను కేంద్ర ప్రభుత్వ నియమించింది. వీరి నియామకాలపై శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 29 Apr 2023 20:01 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాంకులకు కొత్త అధిపతులను కేంద్రం నియమించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BoI) ఎండీ, సీఈఓగా రజనీష్‌ కర్ణాటక్‌ని నియమించింది. బీఓఐ డైరెక్టర్‌గా వ్యవహరించిన అతాను కుమార్‌ దాస్‌ మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో పూర్తయిన నేపథ్యంలో రజనీష్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రజనీష్‌ యూనియన్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

అలాగే, ప్రభుత్వ రంగ బ్యాక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BoB)లో ప్రస్తుత ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దేబదత్తా చంద్‌ను అదే బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. బీఓబీలో డైరెక్టర్‌గా వ్యవహరించిన సంజీవ్‌ చద్దా పదవీకాలం జూన్30 పూర్తవనున్న నేపథ్యంలో చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి ఎండీగా చంద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మరో మూడేళ్ల పాటు ఈ పదవిలోనే కొనసాగనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డైరెక్టర్ల నియామక బాధ్యత చూసే ఫైనాన్షియల్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్ బ్యూరో (FSIB) ఈ ఆర్థిక సంవత్సర జనవరిలోనే వీరి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ రెండు నియామకాలను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని