Coal India: కోల్ ఇండియాలో వాటా అమ్మే యోచనలో కేంద్రం?
కోల్ ఇండియా సహా మొత్తం ఐదు కంపెనీల్లో వాటాలు విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఒక్కో దాంట్లో దాదాపు 5-10శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దిల్లీ: కోల్ ఇండియా, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్లో 5-10 శాతం వాటాలను విక్రయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆఫర్-ఫర్-సేల్ ద్వారా వాటాలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ పేర్కొంది. మొత్తం ఐదు కంపెనీల్లో వాటాలని అమ్మాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఓ నమోదిత సంస్థ కూడా ఉందని సమాచారం.
ఈ కంపెనీల ప్రస్తుత షేరు ధరను పరిగణనలోకి తీసుకుంటే కనిష్ఠ ఆఫర్ ధర వద్ద కంపెనీకి రూ.16,500 కోట్లు సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోందట. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా సమీకరించే నిధులతో ప్రభుత్వం వాటిని సర్దుబాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది రూ.65 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పటి వరకు ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ.26,500 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా తాజా వాటాల విక్రయం ఉపయోగపడనుంది.
వాటాల విక్రయంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే రోడ్షోలను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ఏడాది కోల్ ఇండియా షేరు ధర 48 శాతం, రాష్ట్రీయ కెమికల్స్ 55 శాతం పెరిగాయి. హిందూస్థాన్ జింక్ షేరు మాత్రం 7 శాతం నష్టపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM