Elon Musk: ఇలాంటి బాధ మరెవరికీ రావొద్దు: ఎలాన్ మస్క్
ఆర్థిక కష్టాల్లో ఉన్న ట్విటర్ (Twitter)ను దివాలా ముప్పు నుంచి బయటపడేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఎలాన్ మస్క్ (Elon Musk) తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ (Elon Musk) తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ సంస్థను గట్టెక్కించడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. మరోవైపు ఆయన నేతృత్వంలోని మరో రెండు కీలక సంస్థలు టెస్లా, స్పేస్ఎక్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలు ‘‘చాలా కఠినంగా’’ గడిచాయని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విటర్ (Twitter)ను దివాలా ముప్పు నుంచి రక్షించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందంటూ ఆదివారం ట్వీట్ చేశారు.
‘‘గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయి. ట్విటర్ (Twitter)ను దివాలా నుంచి రక్షించడం కోసమే శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు టెస్లా, స్పేస్ఎక్స్లో కీలక బాధ్యతల్నీ చక్కబెట్టాను. ఇలాంటి బాధ మరొకరికి రావొద్దని ఆశిస్తున్నాను. ట్విటర్ (Twitter)లో ఇంకా సవాళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి లభించిన మద్దతు అభినందనీయం’’ అని మస్క్ (Elon Musk) ట్వీట్ చేశారు.
గత అక్టోబర్లో మస్క్ (Elon Musk) ట్విటర్ (Twitter) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆదాయం గణనీయంగా పడిపోయింది. వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడమే అందుకు కారణం. దీంతో ట్విటర్ (Twitter)ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ (Elon Musk) అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ను ప్రారంభించారు. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు, వసతులను కుదించారు. విలువైన వస్తువులను వేలం వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు