Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజనలోకి ఏడాదిలో కోటి మంది
Atal Pension Yojana New subscribers: సామాజిక భద్రతా పథకమైన ఏపీవైలో ఏడాదిలోనే కోటి మంది కొత్తగా చేరారు. ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో ఉన్నారు.
దిల్లీ: ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రతను కోరుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మలి వయసులో పింఛను అందించేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలైన జాతీయ పింఛను పథకం (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి వాటిల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో ఈ పథకాల్లో చేరే కొత్త చందాదారుల సంఖ్య ఏకంగా 23 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. మార్చి 4 నాటికి ఈ స్కీముల్లో చేరిన వారి సంఖ్య 6.24 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఒక్క అటల్ పెన్షన్ యోజనలోనే కోటి మంది కొత్తగా చేరారని పేర్కొంది.
Also Read: ఆన్లైన్లోనూ అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరుచుకునే వీలు
‘‘నేషనల్ పెన్షన్ సిస్టమ్లో (NPS) 2022 మార్చి 5 నాటికి 508.47 లక్షల మంది (5.08 కోట్లు) చందాదారులు ఉండగా.. ఆ సంఖ్య 2023 మార్చి 4 నాటికి 624.81 లక్షలకు (6.24 కోట్లు) చేరింది. గతేడాదితో పోలిస్తే 22.88 శాతం పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. మొత్తం 6.24 కోట్ల మంది ఎన్పీఎస్ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా... 60.72 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 16.63 లక్షల మంది కార్పొరేట్ చందాదారులు ఉన్నారు.
Also Read: ఎన్పీఎస్ Vs ఏపీవై.. ఏది ఎంచుకోవాలి?
అటల్ పెన్షన్ స్కీమ్లోనే మార్చి 4 నాటికి 4.53 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. గతేడాది కంటే ఈ సంఖ్య 28.4 శాతం పెరిగింది. అటల్ పెన్షన్ యోజనను 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వేల వరకు నెలవారీ పింఛను అందిస్తారు. అయితే, 2022 అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులను ఈ పథకం నుంచి మినహాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర సంఘటిత రంగానికి చెందిన వారు ఎన్పీఎస్ సభ్యులుగా ఉంటే.. అసంఘటిత రంగానికి చెందిన వారు ఏపీవై కిందకు వస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.