Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

పెట్టుబడిదారులకు రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉంటే దీర్ఘకాలంలో భారీ సంపదను కూడబెట్టుకునే సామర్థ్యం మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులపై ఉంది. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

Published : 03 Aug 2023 13:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్ల పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు ఇటీవల గణనీయంగా పెరిగారు. ఈ తరహా పెట్టుబడులపై రిస్క్‌ ఉన్నప్పటికీ రాబడి ఆశాజనకంగానే ఉండడంతో ఇన్వెస్టర్లు పెట్టబడికి మొగ్గు చూపుతున్నారు. స్మాల్‌-క్యాప్‌ ఫండ్లనే తీసుకుంటే ఇవి ప్రధానంగా రూ.5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్లు 8-10 ఏళ్ల దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం.. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు తప్పనిసరిగా తమ పెట్టుబడిలో కనీసం 65% స్మాల్‌ క్యాప్‌ షేర్లకు కేటాయించాలి. అయితే, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో రిస్క్‌ ఎక్కువగానే ఉంటుంది. అందుచేత ఇందులో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కొన్నిసార్లు నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి. 3, 5, 10 సంవత్సరాల్లో 11% కంటే ఎక్కువ రాబడిని అందించిన ఫండ్ల జాబితా ఇక్కడ ఉంది. 2023 ఆగస్టు 2 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి..

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతి (లేదా వారి వెబ్‌సైట్‌ ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్‌ సలహాదారుని ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీరు కమీషన్ చెల్లించనవసరం లేదు. కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్‌ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయని హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని