Stock Market Update: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి....
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఇటీవలి కనిష్ఠాల నేపథ్యంలో దిగువ స్థాయిల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు చైనాలో ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, చమురు ధరలు దిగిరావడం దేశీయ సూచీల సెంటిమెంటును పెంచింది. ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్ తగ్గకపోవడం కలిసొచ్చింది. వాహన విక్రయాలు పుంజుకోవడం, కమొడిటీ ధరలు నెమ్మదిగా కిందకు రావడం కూడా మార్కెట్లకు సానుకూలంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణించడం విశేషం. ఆసియా పసిఫిక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్స్, ఐరోపా మార్కెట్లు ప్రస్తుతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 53,170.70 వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 53,819.31 - 53,143.28 మధ్య ట్రేడయ్యింది. చివరకు 616.62 పాయింట్లు లాభపడి 53,750.97 వద్ద ముగిసింది. 15,818.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 16,011.35 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, 15,800.90 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 178.95 పాయింట్లు ఎగబాకి 15,989.80 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ వరుసగా రెండోరోజు 16,000 మార్క్ను తాకడం గమనార్హం.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఎల్అండ్టీ, టాటా స్టీల్ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టైటన్, కొటాక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి.
మార్కెట్లోని మరిన్ని సంగతులు..
* స్పైస్జెట్ విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇంట్రాడేలో ఓ దశలో కంపెనీ షేర్లు దాదాపు 7 శాతం మేర నష్టపోయాయి. కానీ, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో చివరకు 2.25 శాతం లాభంతో ముగిశాయి.
* ఫెమా నిబంధనల ఉల్లంఘన విషయంలో విచారణ ఎదుర్కొంటున్న పలు క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఈడీ బుధవారం నోటీసులు జారీ చేసింది.
* హీరోమోటోకార్ప్ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోనున్నాయన్న వార్తల నేపథ్యంలో షేర్లు రాణించాయి.
* కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై సానుకూల పవనాల నేపథ్యంలో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్లు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. గత రెండు వారాల్లో ఈ షేరు 29 శాతానికి పైగా లాభపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!