టాటా కార్లు మరింత ప్రియం.. ధరల పెంపు ఎంతంటే?

ఆగస్టు  3 నుంచి తమ సంస్థ విక్రయించే కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు దేశీయ వాహన ఉత్పత్తి సంస్థ టాటా మోటార్స్‌ ప్రకటించింది.

Published : 02 Aug 2021 21:46 IST

ముంబయి: ఆగస్టు  3 నుంచి తమ సంస్థ విక్రయించే కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్లు దేశీయ వాహన ఉత్పత్తి సంస్థ టాటా మోటార్స్‌ ప్రకటించింది.  మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ధరల పెంపు సగటున 0.8 శాతం వరకు ఉంటుందని తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు, వారికి సేవలందించేందుకు.. ‘బిజినెస్‌ ఎజిలిటీ ప్లాన్‌’లో ఈ నిర్ణయం ఓ భాగమని వెల్లడించింది. ముడి పదార్థాల ధరలూ పెరగడం ఓ కారణం. అయితే.. ఆగస్టు 31, లోగా బుక్‌ చేసుకున్న వాహనాలకు ధరల పెంపునుంచి మినహాయింపు ఉంటుందని చెప్పింది. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది మూడోసారి. మేలో 1.8 శాతం పెంచారు. జనవరిలోనూ ఓసారి కార్ల ధరలను దాదాపు రూ.26 వేల వరకు పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని