Union Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి భారతీయుడికీ స్వాతంత్ర్య అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మూల సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలివిడతగా నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు, మలి విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ముందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను తీసుకురానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె తన నాలుగో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!