ఇతర దేశాలకే ఎక్కువ టీకాలిచ్చాం
సొంత దేశంలో ఎంతమందికైతే టీకా డోసులు అందించిందో అంతకంటే ఎక్కువ డోసులు ప్రపంచదేశాలకు భారత్ సరఫరా చేసిందని ఐరాస సర్వప్రతినిధి సభకు మన దేశ ప్రతినిధి కె.నాగరాజు నాయుడు తెలిపారు. 2021 ఆరంభం నాటికే అనేక టీకాలు.......
ఐరాసలో భారత ప్రతినిధి
న్యూయార్క్: సొంత దేశంలో ఎంతమందికైతే టీకా డోసులు అందించిందో అంతకంటే ఎక్కువ డోసులు ప్రపంచదేశాలకు భారత్ సరఫరా చేసిందని ఐరాస సర్వప్రతినిధి సభకు మన దేశ ప్రతినిధి కె.నాగరాజు నాయుడు తెలిపారు. 2021 ఆరంభం నాటికే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. దీంతో టీకాను రూపొందించాలన్న సవాల్ పరిష్కారం అయ్యిందన్నారు. కానీ, అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడం, సమానంగా పంపిణీ చేయడమే ఇప్పుడు ప్రధానంగా అధిగమించాల్సిన సమస్య అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సరైన అవగాహన లేకపోతే పేద దేశాలే అత్యధికంగా ప్రభావితమవుతాయన్నారు.
కరోనాపై పోరులో భారత్ ఎప్పుడూ ముందుందని నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి ఆరు నెలల కాలంలో భారత్లోని 30 కోట్ల మంది కరోనా యోధులకు టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ క్రమంలో 70 దేశాలకు ఇప్పటికే టీకా అందించామని తెలిపారు. దేశీయంగా తయారుచేసిన కొవాగ్జిన్కు ఇప్పటికే అనుమతి లభించగా.. మరో 30 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ టీకాను సైతం భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఐరాసకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?