Ajay Banga: అజయ్ బంగాకు కరోనా.. మోదీతో భేటీ రద్దు
Ajay Banga: రోజువారీ పరీక్షల్లో భాగంగా అజయ్ బంగా (Ajay Banga)కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిందని అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటించింది.
దిల్లీ: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అమెరికా నామినేట్ చేసిన భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా (Ajay Banga)కు కరోనా సోకింది. దీంతో రెండు రోజుల భారత పర్యటనలో ఆయన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో భేటీ కావాల్సి ఉంది. కొవిడ్ కారణంగా ఇప్పుడు అవన్నీ రద్దు కానున్నాయి.
రోజువారీ పరీక్షల్లో భాగంగా అజయ్ బంగా (Ajay Banga)కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిందని అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొంది. కానీ, నిబంధనల్లో భాగంగా ఒక్కరే క్వారంటైన్కు వెళ్లారని తెలిపింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడం కోసం బంగా గత మూడు వారాలుగా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మార్చి 23, 24 తేదీల్లో భారత్లో పర్యటించాల్సి ఉంది.
(ఇదీ చదవండి: అజయ్ బంగా.. మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థే)
ఈ రెండు రోజుల పర్యటనలో భారత అభివృద్ధి, ప్రపంచ బ్యాంకు పాత్ర, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సవాళ్ల వంటి అంశాలపై బంగా (Ajay Banga) ఇక్కడి నాయకులతో చర్చిస్తారని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గతంలో ప్రకటించింది. బంగాను నామినేట్ చేయగానే భారత్ ఆయనకు మద్దతు ప్రకటించింది. అదే బాటలో జపాన్, కొలంబియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెన్యా, సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకే సహా మరికొన్ని దేశాలూ బంగా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి.
(ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ఎన్నికకు ఇదీ తంతు!)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు