Uttar Pradesh: ప్రాక్టికల్స్ పేరిట పిలిపించి.. 17 మంది బాలికలపై వేధింపులు!
ఉత్తర్ప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపలే.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ముజఫ్ఫర్నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలపై ప్రిన్సిపల్తోపాటు అతని సహచరుడు వేధింపులకు...
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపలే.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ముజఫర్నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలపై ప్రిన్సిపల్తోపాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రాక్టికల్స్ పేరిట తమను స్కూల్కి రప్పించి.. ఆహారంలో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోయాక.. ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాలికలు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు వాపోయారు.
‘ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ప్రాక్టికల్ పరీక్షల సాకుతో 17 మంది విద్యార్థినులను స్కూల్కు రప్పించాడు. మరుసటి రోజు మరిన్ని ప్రాక్టికల్స్ ఉంటాయని చెప్పి, ఆ రోజు రాత్రి అక్కడే ఉండాలని సూచించాడు. అనంతరం భోజనం సిద్ధం చేసి, వారికి వడ్డించాడు. అది తిన్న బాలికలు స్పృహ కోల్పోయారు. ఆపై వేధింపులకు పాల్పడ్డాడు’ అని ఓ ఫిర్యాదుదారుడు తెలిపారు. తరగతిలో 29 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం బాలికలను మాత్రమే పిలిచినట్లు మరో వ్యక్తి ఆరోపించారు.
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా, ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేసినట్లు ముజఫర్నగర్ ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అయిదు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.