Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి

భర్తతో గొడవపడిన ఓ భార్య ఆ కోపం పిల్లల మీద చూపించింది. ముగ్గురు సంతానానికి విషమిచ్చి హత్య చేసింది. ఓ పిల్లాడు అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు.......

Published : 18 Aug 2022 02:07 IST

లఖ్‌నవూ‌: భర్తతో గొడవపడిన ఓ భార్య కోపం ముగ్గురు పిల్లల మరణానికి కారణమైంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. భర్త, అత్తింటివారితో గొడవపడిన సునీత యాదవ్‌ తన నలుగురు సంతానాన్ని తీసుకొని వారం రోజుల క్రితమే దంధాని గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. సునీతకు, ఆమె భర్తకు రెండ్రోజుల క్రితం ఫోన్‌లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సునీత తన ముగ్గురు సంతానికి తేనీరులో విషపదార్థం కలిపి ఇచ్చింది. ఫలితంగా తీవ్ర అనారోగ్యం పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అబ్బాయిలు, ఓ బాలిక ఉంది. విషం కలిపిన టీ తాగడంతో హిమాన్షు యాదవ్‌(10), పీయూశ్‌ యాదవ్‌(8), సుప్రియ(5) మరణించినట్లు స్థానిక ఎస్పీ రోహన్‌ ప్రసాద్‌ వెల్లడించారు. నాలుగో కుమారుడు బయట ఆడుకుంటుండటంతో అతడికి తల్లి విషం కలిపిన ఆ టీని ఇవ్వలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని