Road Accident: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

Published : 09 Jan 2022 01:58 IST

బెంగళూరు: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని