ఏటీఎం పగులగొట్టి.. డబ్బు చోరీకి యత్నం

గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేశారు.

Updated : 31 Aug 2020 08:47 IST

దుండగులు పగులగొట్టిన ఏటీఎం

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లడానికి విఫలయత్నం చేశారు. ప్రభాత్‌నగర్‌లోని రైల్వే ఇనిస్టిట్యూట్‌ కూడలిలో యాక్సిస్‌ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు ఆదివారం ఉదయం కనుగొన్నారు. ఏటీఎంతో పాటు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వసం చేశారు. ఏటీఎంలోని లాకర్‌ను పగుల గొట్టడానికి విఫలయత్నం చేశారు. డబ్బులు చోరీ కాలేదని ఒకటో పట్టణ సీఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అనంతపురం నుంచి వేలిముద్రల నిపుణులను పిలిపించి వేలిముద్రలను సేకరించామని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు ఘటనా ప్రదేశాన్ని ఎస్‌ఐ శ్రీనివాసులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని