తిరుపతిలో ఆటోడ్రైవర్‌కు దేహశుద్ధి

అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడో ఆటో డ్రైవర్‌. ఈ ఘటన  తిరుపతిలో చోటుచేసుకుంది.

Published : 08 Nov 2020 20:23 IST

బాలికపై అత్యాచారానికి యత్నించాడనే కారణంతో..

తిరుపతి (నేరవిభాగం): అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడో ఆటో డ్రైవర్‌. ఈ ఘటన  తిరుపతిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి పద్మావతి నగర్‌కు చెందిన దంపతులు ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటగిరి వెళ్లడంతో కుమార్తె(8)ను పక్కనే ఉన్న తిరుమల నగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో విడిచిపెట్టారు. చిన్నారి మధ్యాహ్నం సొంతింటికి బయలుదేరింది. 

ఈ క్రమంలో జయలక్ష్మి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ కరీముల్లా చిన్నారిని గమనించిన వెంట వెళ్లాడు. చిన్నారితోనే ఇంట్లోకి వెళ్లి బాత్‌రూంలో అత్యాచారానికి యత్నించాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపుగా వెళ్తున్న బాలిక అన్న ఏడుపులు విని ఇంట్లోకి వచ్చాడు. బాలిక అన్న రావడాన్ని గమనించిన కరీముల్లా గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో స్థానికులు అతడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి అలిపిరి పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక పిన్ని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని