తుప్పల్లో శవమై తేలిన కరోనా రోగి
ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు..
ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని రోగి బంధువుల ఆరోపణ
ప్రయాగ్రాజ్: ఆసుపత్రి నుంచి పారిపోయిన ఓ కరోనా రోగి అనుమానాస్పద రీతిలో శవమై తేలాడు. 57 ఏళ్ల బాధితుడు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. ఆసుపత్రికి 500 మీటర్ల సమీపంలోని పొదల్లో అతడి మృతదేహం లభ్యమైంది. రోగి ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రయాగ్రాజ్లోని స్వరూప్రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం సదరు రోగిని చేర్పించారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడు ఆసుపత్రి వార్డు గేటు నుంచి బయటకు రావడం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యింది.
ఆసుపత్రి సిబ్బంది వేధింపుల వల్లనే పారిపోయాడని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మృతుడు వారి బంధువులతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ‘రాత్రి నుంచి నోరంతా ఎండిపోతోంది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు’ అని బాధితుడు అందులో పేర్కొన్నాడు. ఆ ఆడియో క్లిప్ నిన్న బయటకు వచ్చింది. కాగా మృతుడి బంధువుల ఆరోపణలను ఆసుపత్రి వర్గం ఖండించింది. ‘సదరు రోగి జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్స అందిస్తుండటంతో అతడి ఆరోగ్యం కుదుటపడుతోంది. కానీ అతడు ఎందుకు పారిపోయాడో తెలియడం లేదు. అతడిని ఆపేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే వెళ్లిపోయాడు. సిబ్బంది అతడిని వెంబడించినా లాభం లేకుండా పోయింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాం’ అని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డా.ఎస్పీ సింగ్ వెల్లడించారు.
పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య కార్యకర్తలు ఆదివారం సాయంత్రం పొదల్లో నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ ప్రాంతం ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలోనే ఉంది. ‘మా తండ్రి ఇక లేరు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే మా నాన్న చనిపోయారు. ఆసుపత్రిలోని రోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు’ అని మృతుడి కుమార్తె ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి