ఆమె రోదనలు వినిపించలేదేమో..!

తెలిసిన వ్యక్తే కదా అని అమాయకంగా వెంటవెళ్లిన ఓ దివ్యాంగురాలిపై సమీప బంధువు రాక్షసత్వం వెల్లగక్కాడు. కనికరం చూపని ఆ కామాంధుడు బధిర బాలిపై కర్కశత్వం ప్రదర్శించాడు. అత్యాచారానికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేశాడు...

Published : 18 Oct 2020 12:45 IST

బధిర బాలికపై అత్యాచారం, హత్య

 

అహ్మదాబాద్‌: తెలిసిన వ్యక్తే కదా అని అమాయకంగా వెంటవెళ్లిన ఓ దివ్యాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. గుజరాత్‌లోని బనాస్కాంతలో పొలాల్లో నిర్జీవంగా పడిఉన్న ఓ 12 ఏళ్ల బధిర (మూగ, చెవుడు) బాలిక మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసి, గొంతునులిమి హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాలిక పసుపురంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తితో ద్విచక్రవాహనంపై వెళుతూ కనిపించింది. అయితే, అతడు తమ సమీప బంధువేనని బాలిక తల్లిదండ్రులు గుర్తించారు. 24 ఏళ్ల సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మాయమాటలు చెప్పి అతడే తమ కుమార్తెపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని