మంచినీళ్ల ట్యాంకర్‌లో మద్యం సరఫరా

గుంటూరు జిల్లా మునుగోడు మండలం అమరావతి వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి నీళ్ల ట్యాంకర్‌లో మద్యం తరలిస్తున్న సత్తెనపల్లి మండలం అబ్బూరుకు ..

Published : 06 Sep 2020 01:01 IST

మునుగోడు: గుంటూరు జిల్లా మునుగోడు మండలం అమరావతి వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి నీళ్ల ట్యాంకర్‌లో మద్యం తరలిస్తున్న సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి  నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి సమారు 10వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు సోదాలు చేస్తున్నా తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని