పోలీస్‌స్టేషన్‌లో యువకుడికి శిరోముండనం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిపై పోలీసులు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి గాయాలయ్యేలా ..

Published : 22 Jul 2020 02:09 IST

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిపై పోలీసులు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి గాయాలయ్యేలా కొట్టి, శిరోముండనం చేశారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

మరోవైపు వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఎస్సీ యువకుడిని సీతానగరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.తీవ్ర గాయాలైన బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెదుళ్ల పల్లిలోని బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. సీతానగరంలో ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని