గుర్తు తెలియని వాహనం ఢీ : ముగ్గురి మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బోయ సురేష్‌(28), చాకలి కృష్ణ(30), బెంగళూరుకు చెందిన ....

Published : 07 Sep 2020 10:29 IST

రాయదుర్గం రూరల్‌: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బోయ సురేష్‌(28), చాకలి కృష్ణ(30), బెంగళూరుకు చెందిన  సిద్ధనగౌడ(30) తో కలిసి  బెలుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి కదరంపల్లి వైపునకు ద్విచక్రవాహంపై వెళ్తుండగా. మార్గమధ్యంలో కదరంపల్లి గ్రామం జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో  రాయదుర్గం ఎస్సై రాఘవేంద్రప్ప ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను  రాయదుర్గం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని