Medak: బైక్ పైనుంచి కిందపడేసి సిమెంటు ఇటుకలతో కొట్టి.. వ్యక్తి దారుణ హత్య
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్లో దారుణం జరిగింది. దండుపల్లి వద్ద దాయాదుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
మనోహరాబాద్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్లో దారుణం జరిగింది. దండుపల్లి వద్ద దాయాదుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబీకులకు గ్రామ సమీపంలో కొంత భూమి ఉంది. ఈ విషయంలో లక్ష్మీనారాయణ, ఆయన దాయాదులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బైక్పై గ్రామానికి వెళ్తున్న లక్ష్మీ నారాయణపై బంధువులు దాడి చేశారు. వాహనం పైనుంచి కింద పడేసి సిమెంటు ఇటుకలు, రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. చికిత్స నిమిత్తం బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటపల్లిలో చిరుతపులి చర్మం స్వాధీనం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద సోమవారం చిరుతపులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ తెలుగు సినీ, బుల్లితెర నటులు!
బెంగళూరు శివారులోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. -
ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!
బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు.. వారి వివాహాల కోసం కొందరు.. పెన్షన్లా ఉపయోగపడుతుందని మరికొందరు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేశారు. -
రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.5 వేలు.. బిల్లు మంజూరుకు రూ.7 వేలు లంచం..!
హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
యూపీలో ఎనిమిది సార్లు ఓటేసిన మైనర్ అరెస్ట్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న నాలుగో విడత పోలింగ్లో 17 ఏళ్ల యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేశాడు. -
నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దుండగుల దాడి
పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లాలోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒడిశాలో పోలింగ్ కేంద్రం వద్ద ఒకరి హత్య
ఒడిశాలోని బరగఢ్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని సొరొసొరాకు చెందిన ఆటోడ్రైవర్ బిశ్వనాథ్ (35)ను సోమవారం మధ్యాహ్నం ఒక పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రత్యర్థులు హతమార్చారు. -
ఛత్తీస్గఢ్లో లోయలో పడిన వాహనం.. 18 మంది గిరిజనుల దుర్మరణం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లా(కవర్ధా) బహపానీ గ్రామ సమీపంలో సోమవారం ఓ వాహనం లోయలో పడి 18 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు.