Medak: బైక్‌ పైనుంచి కిందపడేసి సిమెంటు ఇటుకలతో కొట్టి.. వ్యక్తి దారుణ హత్య

మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌లో దారుణం జరిగింది. దండుపల్లి వద్ద దాయాదుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Updated : 29 Jul 2023 09:56 IST

మనోహరాబాద్‌: మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌లో దారుణం జరిగింది. దండుపల్లి వద్ద దాయాదుల చేతిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మండలంలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ గౌడ్‌ కుటుంబీకులకు గ్రామ సమీపంలో కొంత భూమి ఉంది. ఈ విషయంలో లక్ష్మీనారాయణ, ఆయన దాయాదులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బైక్‌పై గ్రామానికి వెళ్తున్న లక్ష్మీ నారాయణపై బంధువులు దాడి చేశారు. వాహనం పైనుంచి కింద పడేసి సిమెంటు ఇటుకలు, రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. చికిత్స నిమిత్తం బాధితుణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని