Kurnool: అల్లుడి ఘాతుకం: భార్య, అత్త దారుణహత్య.. మామకు తీవ్ర గాయాలు

కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి అయిన రెండు వారాలకే ఓ యువకుడు భార్యతో పాటు అత్తను చంపేశాడు.

Updated : 15 Mar 2023 07:21 IST

కర్నూలు(నేరవిభాగం): కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. అల్లుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లి అయిన రెండు వారాలకే భార్యతో పాటు అత్తను చంపేశాడు. తమ ఇంటికి వచ్చిన అత్త, మామలపై అల్లుడు, అతడి తండ్రి దాడి చేశారు. ఈ ఘటనలో భార్య, అత్త మృతిచెందగా.. మామకు తీవ్ర గాయాలయ్యాయి. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలులోని చింతల మునినగర్‌కు చెందిన శ్రావణ్‌ అనే యువకుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడు ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణి (20)తో శ్రావణ్‌కు ఈనెల 1న వివాహం జరిగింది. ఈ క్రమంలో శ్రావణ్‌ అత్త రమాదేవి(50), మామ వెంకటేశ్వర్లు.. కర్నూలులోని తమ కుమార్తె వద్దకు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామలతో అల్లుడు శ్రావణ్‌ గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడై భార్య, అత్త, మామలపై కత్తితో దాడి చేశాడు. శ్రావణ్‌కు అతడి తండ్రి ప్రసాద్‌ సహకరించాడు. ఇద్దరూ కలిసి తీవ్రంగా గాయపరచడంతో రుక్మిణి, రమాదేవి అక్కడికక్కడే మృతిచెందగా.. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్‌, ఇన్‌ఛార్జ్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు రామయ్య, పెద్దయ్యనాయుడు పరిశీలించారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని