Bihar: ఏఎస్‌ఐని తాళ్లతో కట్టేసి.. చితకబాది!

ఓ ఏఎస్‌ఐపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆయనను తాళ్లతో కట్టేసి చితకబాదారు. బిహార్‌లో దీపావళి నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది......

Published : 08 Nov 2021 01:25 IST

పాట్నా: ఓ ఏఎస్‌ఐపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. తాళ్లతో కట్టేసి చితకబాదారు. బిహార్‌లో దీపావళి నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తూర్పు చంపారన్‌ జిల్లా మోతిహరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధరమ్‌పుర్‌ గ్రామంలో గొడవ జరుగుతోందని దీపావళి రోజు సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఎస్‌ఐ సీతారాం దాస్‌ హుటాహుటిన అక్కడకు బయల్దేరి వెళ్లారు.

యితే ఏఎస్‌ఐ అక్కడికి వెళ్లడంతో యువత మరింత రెచ్చిపోయారు. దీపావళి పండగ నాడు పోలీసులు పెట్రోలింగ్‌ ఎలా చేస్తారంటూ.. దుర్భాలాడుతూ ఏఎస్‌ఐపై దాడికి దిగారు. చేతులను తాడుతో వెనక్కి కట్టేసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. తర్వాత వదిలేయడంతో ఆయన పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పలువురు యువకులపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని