Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్‌ మలుపు వద్ద కారు  అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.

Updated : 28 Oct 2022 20:03 IST

కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్‌ మలుపు వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో  మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు. కేసముద్రం బైపాస్‌ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కారులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మహిళలను వెలికి తీయగా ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బావిలో పడిన కారును  జేసీబీ సాయంతో బయటకు తీయగా కారులో చిక్కుకున్న రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన తల్లీకుమారులు లలిత(40), సురేష్‌(20). టేకులపల్లికి చెందిన అశాలి(32), భద్రు(40)గా  పోలీసులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని