Shocking: కొవిడ్ మృతదేహాన్ని నదిలో విసిరేశారు!
ఉత్తర్ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని ఓ నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ధ్రువీకరించిన అధికారులు, బంధువులపై కేసు నమోదు
బలరాంపూర్: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అవి కొవిడ్ వల్ల చనిపోయిన వారి మృతదేహాలే అని అనుమానిస్తున్న సమయంలో తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఉత్తర్ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరోవ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపిన జిల్లా వైద్యాధికారులు అది కొవిడ్ వ్యక్తి మృతదేహమేనని ధ్రువీకరించారు. చనిపోయిన వ్యక్తి బంధువులే నదిలో పడవేసినట్లు గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.
‘కొవిడ్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మే 25వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల అనంతరం అతడు ప్రాణాలు కోల్పోయాడు. కొవిడ్ నిబంధనల ప్రకారం, వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. కానీ, ఆ దేహాన్ని వారు నదిలో విడిచిపెట్టినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. దీనిపై ఇప్పటికే వారిపై కేసు నమోదు చేశాం. పూర్తి దర్యాప్తు అనంతరం వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోన్న వేళ.. నదుల్లో మృతదేహాలు కొట్టుకువస్తోన్న ఘటనలు వెలుగు చూశాయి. బిహార్లోని బక్సర్ జిల్లాలో ఒకేసారి 71మృతదేహాలు కొట్టుకురావడం ఆందోళనకు గురిచేసింది. అనంతరం బిహార్, యూపీల్లో ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నదిలో మృతదేహాలను పడవేయకుండా చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పటికీ ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.