Crime News: 30 మంది మైనర్లను బలిగొన్న మానవమృగానికి.. జీవిత ఖైదు
Crime News: చిన్నారులనే కనికరం లేకుండా 30 మంది ఆడపిల్లల్ని హింసించి(Sexual assault), హతమార్చిన కేసులో రవీంద్ర కుమార్ అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
దిల్లీ: అభం శుభం తెలియని పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి, లైంగికదాడి (Sexual assault)కి పాల్పడి ప్రాణాలు తీసిన మానవ మృగానికి గురువారం కోర్టు శిక్ష విధించింది. దోషి రవీంద్రకుమార్(Ravindra Kumar)కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీలోని రోహిణి కోర్టు(Rohini Court) తీర్పునిచ్చింది. ఆరేళ్ల చిన్నారిని దారుణంగా హింసించి, హతమార్చిన కేసులో మే 9నే కోర్టు అతడిని దోషిగా తేల్చగా.. తాజాగా శిక్ష ఖరారు చేసింది.
ఇంతకీ కేసు ఏంటంటే..?
రవీంద్రకుమార్ 18 ఏళ్ల వయసులో ఉండగా, 2008లో అతడి కుటుంబం ఉత్తర్ప్రదేశ్ నుంచి దిల్లీకి వలస వచ్చింది. తండ్రి ప్లంబర్. తల్లి ఇళ్లలో పనిచేసేది. దిల్లీ(Delhi) వచ్చిన కొద్దిరోజులకు రవీంద్ర డ్రగ్స్కు, అశ్లీల దృశ్యాలకు బానిసయ్యాడు. రోజంతా కూలీగా పనిచేసి, రాత్రిపూట డ్రగ్స్ తీసుకునేవాడు. అర్ధరాత్రి నిద్ర లేచి చిన్నపిల్లలను వెదుక్కొంటూ దగ్గర్లోని నిర్మాణ ప్రదేశాలు, మురికివాడలకు వెళ్లేవాడు. దొరికిన పిల్లలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగికంగా హింసించాక హతమార్చేవాడు. ఇలా 2008 నుంచి 2015 మధ్య 30 మంది ఉసురు తీశాడు. మృతులంతా 6-12 ఏళ్ల వయసువారే. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వేర్వేరు ప్రదేశాలను ఈ ఘోరాలకు ఎంచుకునేవాడు.
అలా 2014లో ఆరేళ్ల పాపను చంపి, సెప్టిక్ ట్యాంకులో విసిరేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2015లో దిల్లీలోని సుఖ్బీర్నగర్ ప్రాంతంలో రవీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. తాజాగా జీవిత ఖైదు విధించింది. అయితే దాదాపు 30 మంది చిన్నారులపై అకృత్యాలు, హత్యలకు పాల్పడినట్లు రవీంద్రపై అభియోగాలుండగా.. ప్రస్తుతానికి మూడు కేసుల్లో మాత్రమే విచారణ జరిగింది. మిగతావాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..